పృద్వి కోసం విష్ణు అలాంటి పని కూడా చేసింది.. ఓపెన్ అయిన సోనియా..!?

Anilkumar
బిగ్ బాస్ సీజన్ 8 రసవత్తరంగా సాగుతున్న సంగతి  తెలిసిందే. ఇప్పటికే 7 సీజన్ లను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు సీజన్ 8 ను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే హౌస్ నుండి ముగ్గురిని  ఎలిమినేట్ చేశారు.  తాజాగా సోనియా ఆకుల హౌస్ నుండి బయటకు వచ్చింది.  4 వ వరం ఇంటి నుండి బయటకి  వచ్చిన సోనియా ప్రస్తుతం వరుస ఇంటర్వూస్ ఇస్తుంది. ఇదిలా ఉంటే ప్రతి సీజన్లో rgv బ్యాగ్రౌండ్ నుండి ఎవరో ఒకరు హౌస్ లోకి వస్తు ఉంటారు.  ఆలా ఈ సీజన్ లో సైతం సోనియా ఎంట్రీ ఇచ్చింది.  కానీ హౌస్ లోకి ఎంట్రీ ఇచినప్పటి నుండి పూర్తి స్థాయి లో   నెగిటివిటీ మూటగట్టుకుంది ఈ భామ.  

ముఖ్యంగా పృథ్వి,  నిఖిల్ తో ఈమె ప్రవర్తించిన తీరు వల్లే ఈ రోజు సోనియా బయటకి వచ్చింది అన్న టాక్ వినిపిస్తుంది.  అయితే తాజాగా ఈమె పాల్గొన్న ఒక ఇంటర్వ్యూ లో భాగంగా  విష్ణు తో తనకి జరిగిన గొడవ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది..   ఏంటంటే .. పృథ్వీ కోసమే విష్ణు నన్ను టార్గెట్ చేసింది.. అందుకే ఆ గొడవ జరిగింది అంటూ చెప్పింది సోనియా . విష్ణు అందరి దగ్గర వేసే కామెడీ అందరికి నచ్చుతుంది . కానీ నా దగ్గర అలాంటివి నడవవు.. తన కామెడీ నాకు నచ్చదు.. అందుకే మా ఇద్దరికి గొడవ అయింది.  మీకు టీవి లో చూపించింది కొద్దిసేపే..  కానీ నాతో 2 గంటలు గొడవ పడింది. నువ్వో పెద్ద  పతివ్రత అన్న ఒక్క మాటే కాదు..  ఇంకా చాలా మాటలు అనింది.. అసలు అలంటి క్యారెక్టర్ నేను ఇప్పటి వరకు చూడలేదు..

 తను ఏజ్ లో నాకన్నా చాల చిన్న .. నేను కూడా తిట్టొచ్చు కానీ వదిలేసా అంటూ చెప్పింది.   అంతేకాదు పృద్వి తో నేను క్లోజ్ గా ఉండడం తనకి నచ్చలేదు..  అందుకే నన్ను కావాలనే టార్గెట్ చేసి మరి ఇలా గొడవ పడింది..  తనకి ఎప్పుడు పృద్వి తో ఉండాలని ఉంటుంది..   నేను పృద్వి ని ఒక తమ్ముడి లా చూసుకున్న..  కానీ దాన్ని తను వేరే లా అర్ధం చేసుకుంది..  దానికి నేను ఏమి చేయలేను  అంటూ విష్ణు తో గొడవకి కారణం చెప్పింది సోనియా.  ఏదేమైనప్పటికే సోనియా ప్రవర్తన ఆడియన్స్ కి నచ్చకే ఇంట్లో నుండి బయటికి రావడం జరిగింది అంటున్నారు. అయితే ఒకింత ఇది మంచికే అయింది  అంటున్నారు.. !!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: