సైలెంట్‌ గా జూ.ఎన్టీఆర్‌ కు గునపం దింపుతున్న హీరో ?

Veldandi Saikiran

దక్షిణ భారతంలో విలక్షణ నటుడు అరవిందస్వామి, కార్తీ కాంబినేషన్ లో వచ్చిన సినిమా సత్యం సుందరం. ఎమోషన్స్, ఫీల్, గుడ్ మూమెంట్స్, ఫన్, ఫ్యామిలీ వాల్యూస్ తో రూపొందిన ఈ సినిమాకి 96 చిత్రాన్ని అందించిన ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించారు. భావోద్వేగమైన కథనాలతో, కథతో రూపొందిన ఈ సినిమాను స్టార్ హీరో హీరోయిన్లు సూర్య, జ్యోతిక నిర్మించారు. తమిళంలో మీఅలగన్, తెలుగులో సత్యం సుందరం అనే టైటిల్ తో రిలీజ్ అయింది. ఆర్టిస్టుల రెమ్యూనరేషన్లు, టెక్నీషియన్స్, పారితోషికంతో కలిపి ఈ సినిమాకు సుమారుగా 40 కోట్ల రూపాయల వరకు బడ్జెట్ కేటాయించారు.

ఇక ఈ సినిమా రూ. 40 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ పాజిటివ్ రివ్యూస్ ఇవ్వడంతో దేవర సినిమా ప్రభావం.... సత్యం సుందరం సినిమా మీద కాస్తంత కూడా పడలేదు. ఆడియన్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా విడుదలై నిన్నటితో ఐదు రోజులు పూర్తి చేసుకుంది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం.... ఈ చిత్రానికి ఇప్పటివరకు నైజాం ప్రాంతంలో రెండు కోట్ల 20 లక్షల రూపాయలు, అలాగే ఆంధ్రప్రదేశ్, సీడెడ్ ప్రాంతాలకు కలిపి కోటి 75 లక్షల రూపాయలు వచ్చాయి.

ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు 4 కోట్ల 50 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చినట్లుగా అంచనా వేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ తెలుగు వెర్షన్ అంతా కలిపి రెండు కోట్ల రూపాయలకు జరిగింది. ఐదు రోజుల్లోనే రెండింతల లాభాలు ఈ సినిమాకు వచ్చాయి. ఇక ఫుల్ రన్ టైంలో ఎంతవరకు లాభాలను రాబడుతుందో చూడాల్సి ఉంది. బుక్ మై షో టికెట్ యాప్ పోర్టల్ ప్రకారం ఈ సినిమాకి ఐదు రోజుల్లో తెలుగు వెర్షన్ కి లక్ష టికెట్లు అమ్ముడైనట్టుగా సమాచారం అందుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ntr

సంబంధిత వార్తలు: