నాగార్జున: 100 కోట్ల పరువు నష్టం దావా...?

Veldandi Saikiran
ప్రస్తుతం దేశవ్యాప్తంగా సమంతా అలాగే నాగచైతన్య అంశం హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఎక్కడ చూసినా.. సమంతా అలాగే నాగచైతన్య విడాకుల గురించి.. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల అంశంపైనే చర్చించుకుంటున్నారు. అయితే దీనిపై ఇప్పటికే కొండా సురేఖ ను టార్గెట్ చేసి అక్కినేని కుటుంబంతో పాటు సమంత.. ఓ రేంజ్ లో ఫైర్... కావడం జరిగింది. సోషల్ మీడియా వేదికగా.. కొండ సురేఖ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
టాలీవుడ్ హీరోలు అలాగే సెలబ్రిటీలు కూడా కొండా సురేఖను టార్గెట్ చేస్తూ క్షమాపణలు చెప్పాల్సిందేనని.. పోస్టులు పెట్టారు. దీంతో వెంటనే అక్కినేని కుటుంబానికి అలాగే సమంతకు కొండా సురేఖ క్షమాపణలు చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా కొండా సురేఖలో పెద్దగా మార్పు కనిపించలేదని తెలుస్తోంది. క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా అక్కినేని నాగచైతన్య అలాగే సమంత విడాకులు తీసుకోవడానికి కారణాలు ఏంటి అంటూ..  ఆమె మరోసారి వ్యాఖ్యలు చేశారు.
 అయితే ఈ అంశం నేపథ్యంలోనే అక్కినేని నాగార్జున కోర్టుకు వెళ్లారు. ఇప్పటికే పిటిషన్ కూడా వేశారు.  దాదాపు 100 కోట్ల పరువు నష్టం దావా కేసును కొండ సురేఖ పై వేశారట అక్కినేని నాగార్జున.  తన కుటుంబ సభ్యులతో చర్చించి మరి... ఈ కేసు వేసినట్లు వార్తలు వస్తున్నాయి. కొండా సురేఖను రోడ్డుపైకి ఈడ్చే వరకు వదిలేదే లేదని అక్కినేని కుటుంబం ఓ నిర్ణయానికి వచ్చిందట.
 అందుకే శుక్రవారం కూడా అక్కినేని అఖిల్...  మరోసారి సోషల్ మీడియాలో కొండా సురేఖకు వార్నింగ్ ఇచ్చారు.  మీ అంతు చూసేవరకు వదిలేది లేదని అక్కినేని అఖిల్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇక అటు .. తన కుటుంబం కోసం టాలీవుడ్ సెలబ్రిటీ లందరూ.. దిగివచ్చి మద్దతు తెలపడం పట్ల అక్కినేని నాగార్జున స్పందించారు. తన కుటుంబం కోసం.. స్పందించినందుకు వారందరికీ సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు అక్కినేని నాగార్జున. ఇదంతా తన నాన్న అక్కినేని నాగేశ్వరరావు... వల్లే సాధ్యమైందని ఆయన నాన్నను గుర్తు చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: