స్టార్ హీరో రాజేంద్రప్రసాద్ ఇంట విషాదం..!

Divya
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి పాత్రలోనైనా సరే జీవించి పోయేటువంటి నటులలో హీరో రాజేంద్రప్రసాద్ కూడా ఒకరు. గతంలో ఎన్నో కామెడీ చిత్రాలలో నటించి తనకంటూ ఒక బ్రాండ్ సంపాదించుకున్న రాజేంద్రప్రసాద్ ఈ మధ్యకాలంలో పలు చిత్రాలలో తండ్రిగా ఎన్నో అద్భుతమైన పాత్రలలో నటిస్తూ ప్రతి పాత్రకు కూడా ప్రాణం పోసి నటించేలా జీవిస్తున్నారు రాజేంద్రప్రసాద్. అయితే ఇప్పుడు తాజాగా రాజేంద్రప్రసాద్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకున్నది. వాటి గురించి పూర్తిగా చూద్దాం.

రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి అతి చిన్న వయసులోనే కన్నుమూసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.. రాజేంద్రప్రసాద్ కూతురు వయసు కేవలం 38 సంవత్సరాలు అయితే ఆమెకు గుండెపోటు కారణం చేత గడిచిన కొన్ని నిమిషాల క్రితమే కన్నుమూసినట్లుగా తెలుస్తోంది.. నిన్నటి రోజున రాత్రి ఆమెకు గాయత్రికి గుండెపోటు రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు హుటాహుటిగా హైదరాబాదులోని ఏఐజి ఆసుపత్రికి సైతం తరలించారట. అక్కడే చికిత్స పొందుతూ ఆమె మరణించినట్లుగా సమాచారం. అయితే అతి చిన్న వయసులోనే ఇలా మరణించడంతో ఈ విషయం విన్న  రాజేంద్రప్రసాద్ అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. అయితే ఈ విషయం తెలిసిన పలువురు సెలబ్రిటీలు నెట్టిజెన్స్ సైతం ఆమె మృతికి  సంతాపం తెలియజేస్తున్నారు.

రాజేంద్రప్రసాద్ కుమార్తె మృతికి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నది. రాజేంద్రప్రసాద్ కు ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు.గాయత్రి భర్త కూడ ఉద్యోగస్తుడేనట .. గాయత్రికి ఒక కూతురు కూడా ఉన్నది ఆమె చైల్డ్ యాక్టర్ గా కూడా ఒక సినిమాలో నటించిందట. రాజేంద్రప్రసాద్ సినిమా కెరియర్ విషయానికి వస్తే.. కల్కి చిత్రంలో ఒక అద్భుతమైన పాత్రలో నటించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నారు. తన వయసుకు తగ్గట్టుగా పాత్రలలో నటిస్తూ బాగానే మెప్పిస్తున్నారు.అలాగే సినీ ఇండస్ట్రీలో ఎలాంటి విషయాలు జరిగినా కూడా వాటి గురించి స్పందిస్తూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: