ఎమ్మెస్ నారాయణ చివరి కోరికకు బ్రహ్మానందం కు లింక్ ఏంటి.. ఇప్పటికీ బాధపడుతున్న బ్రహ్మీ..!

Amruth kumar
ఇక మన తెలుగు చత్ర పరిశ్రమ లో బ్రహ్మానందం తర్వాత హాస్యనటుల్లో ఎమ్మెస్ నారాయణ ఎన్నో మంచి పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేక అభిమానులను తెచ్చుకున్నారు . ప్రధానంగా తాగుబోతు పాత్రల కు ఆయన బ్రాండ్ అనే చెప్పవచ్చు . ఆ పాత్రల్లో మంచి నటనను చూపించి అందరినీ న‌వ్వించే వారు . ఎంఎస్ నారాయణ దూకుడు , దుబాయ్ శీను సినిమాల్లో ఆయన చేసిన పాత్రలో ఇప్పటి కీ ప్రేక్ష‌కుల ను ఎంతో నవ్విస్తున్నాయి.

ఇక ఇదే క్రమంలో బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ మధ్య ఎంతో గొప్ప స్నేహం ఉంది . వీరిద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో కూడా నటించారు. అలాంటి ఎమ్మెస్ నారాయణ చనిపోయే చివరి రోజుల్లో ఊహించని సంఘటన జరిగిందట .. దాని గురించి బ్రహ్మానందం ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు . ఇక ఎప్పుడైతే అనారోగ్యం కారణంగా ఎమ్మెస్ నారాయణ హాస్పిటల్ లో చేరారో .. చివరి దశలో ఉన్నారని మరియు ఆయన చ‌నిపోతారని తెలిసినప్పుడు మరో గంటలో మరో ఆయన చనిపోతాను అనగా తన కుమార్తె ను పిలిచి ఒక పేపర్ అడిగారట .

ఆ పేపర్ మీద బ్రహ్మానందం అన్నయ్యని చూడాలని ఉంది .. అని ఎమ్మెస్ నారాయణ రాశారట . దాంతో ఆమె బ్రహ్మానందం కి ఫోన్ చేసి విషయం చెప్ప గా బ్రహ్మానందం వెంటనే ఆస్పత్రికి వెళ్లారట . అప్పుడు ఎమ్మెస్ నారాయణ చేయి పట్టుకుని ఆయన కు ఏదో చెప్పడానికి ప్రయత్నించారట  కొంత మాత్రమే అర్థమవుతుంది చేయి గట్టిగా పట్టుకుని అన్నయ్య అని పిలిచాడు ఆ బాధను చూస్తూ ఉండలేక బయటికి వచ్చేసానని .. ఆ తర్వాత 15 నిమిషాలు మాత్రమే ప్రాణం ఉంది అంటూ బ్రహ్మానందం ఎంతో బాధపడ్డాను అంటూ ఆ ఇంటర్వ్యూ  లో చెప్పుకొచ్చారు . అలా తన చేతి లోనే ఎమ్మెస్ నారాయణ చనిపోయాడని బ్రహ్మానందం ఇప్పటికీ బాధపడుతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: