ప్రియమణికి వేధింపులు.. ఆ ఫోటోలు పెట్టి నరకం చూపిస్తున్నారు..?

Veldandi Saikiran
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. కానీ అందులో కొంతమంది మాత్రమే అతి తక్కువ కాలంలో పాపులర్ అవుతూ ఉంటారు. అలా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోయిన్లలో ప్రియమణి వాసుదేవ్ మనీ ఒకరు. ఆమెను ముద్దుగా ప్రియమణి అని అందరూ పిలుస్తూ ఉంటారు కేరళకు చెందిన ఈ బ్యూటీ.. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే బాగా ఫేమస్ అయింది. 2003 సంవత్సరం నుంచి... తెలుగు ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ బ్యూటీ.. ఇప్పటికీ రాణిస్తోంది.

2003 సంవత్సరంలో ఎవరే అతగాడు అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత పెళ్లయిన కొత్తలో... అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకుంది ప్రియమణి. దీంతో జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోల సినిమాలలో కూడా ఛాన్సులు కొట్టేసింది. జూనియర్ ఎన్టీఆర్ అలాగే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన యమదొంగలో... ప్రియమణి నటించిన సంగతి తెలిసిందే. దాంతో ప్రియమణి కెరీర్ ఎక్కడికో వెళ్లిపోయింది.

ఆ తర్వాత ప్రవరాఖ్యుడు, శంభో శివ శంభో, గోలీమార్ లాంటి సినిమాలు చేసి మంచి సక్సెస్ అందుకుంది. అయితే అలాంటి నటి ప్రియమణి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. తనను చాలామంది టార్గెట్ చేసి వేధిస్తున్నారని హీరోయిన్ ప్రియమణి.. తాజాగా బాంబు పేల్చింది. వేరే మతస్తుడిని ఎలా పెళ్లి చేసుకుంటావని... ప్రియమణి చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
 
వేరే మద్దస్తుణ్ణి  పెళ్లి చేసుకోవడం పట్ల ఇప్పటికి కూడా ట్రోలింగ్ చేస్తున్నారని... నటి ప్రియమణి ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను ఎంత సీరియస్గా  వార్నింగ్ ఇచ్చిన ట్రోలింగ్ మాత్రం ఆగడం లేదని ఆమె పేర్కొనడం జరిగింది.  2016లో ముస్తఫా రాజ్ తో నిశ్చితార్థం అయినప్పటి నుంచి నన్ను ట్రోలింగ్ చేయడం మొదలు పెట్టారని ఆమె వివరించింది. ఎంతోమంది స్టార్లు  కుల అలాగే మతాంతర వివాహం చేసుకున్న నన్నే నిందించడం చాలా బాధాకరమని ఆమె వెల్లడించడం జరిగింది. కులమత వ్యత్తులు ప్రేమకు అసలు ఉండవని ఆమె వివరించింది. కానీ కొంతమంది అసభ్యకరమైన ఫోటోలు పెట్టి మరి... ట్రోలింగ్ చేస్తున్నారని ఆగ్రహించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: