సందీప్ రెడ్డి ప్లానింగ్ మామూలుగా లేదుగా.. ప్రభాస్‌కు దీటుగాా మెగాస్టార్..!

Amruth kumar
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. సలార్ , క‌ల్కిఇలా బ్యాక్ టు బ్యాక్ విజయాల తో ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు  ప్రభాస్ . ఇదే ఊపుతో చాలా సినిమాలను లైన్లో పెట్టాడు . ఇలా లైన్ లో ఉన్న‌ సినిమాలలో భారీ అంచనాలు ఉన్న మూవీ స్పిరిట్ .. డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెర్కెక్కిస్తున్నారు . ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో ఉన్న ఈ సినిమా నుంచి ఓ క్రేజీ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతుంది .

అసలు విషయం ఏమిటి అంటే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఓ కీలక పాత్రలో కనిపించ బోతున్నాడనే టాక్ వినిపిస్తుంది . ఇప్పటికే బాలీవుడ్ స్టార్ జంట సైఫాలి ఖాన్, కరీనాకపూర్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు . ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి పేరు కూడా వినిపిస్తుంది , అయితే చిత్ర యూనీట్‌ నుంచి ఇప్ప‌టి వరకు ఎలాంటి అధికార ప్రకటన బయటకు రాలేదు. కాగా ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది నుంచి ప్రారంభం కానుంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్‌ సినిమా రాబోతోంది.

కాగా ఈ సినిమా షూటింగ్ వచ్చే సంవత్సరం నుంచి మొదలు కానుంది. ఇక దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఈ సినిమా కథనే ఎవరు ఊహించని స్టోరీ తో తెర‌క్కెకించ‌బోతున్న‌డు అంటూ మేకర్స్ చెబుతున్నారు . అదే విధంగా సందీప్ మార్క్ యాక్షన్ అండ్ వైల్డ్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఊహించని స్థాయిలో ఉంటాయని కూడా అంటున్నారు. దాదాపు రూ.400 కోట్ల కు పైగా బడ్జెట్‌ తో ఈ సినిమాను తెరకెక్కి్స్తున్నారు మేకర్స్ . హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ నిర్మిస్తున్నాయి . త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభం కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: