మెగా అభిమానులకు షాకింగ్ న్యూస్.. చిరంజీవికి యాక్సిడెంట్.. అసలు నిజం ఇదే..!?

Amruth kumar
 మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభరా సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడుమ‌. ఈ సినిమామ‌ను సంక్రాంతి కానుకగా ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని జస్ట్ స్పీడ్ లో షూటింగ్ ను పూర్తి చేస్తున్నాడు . అయితే  ఇప్పుడు తాజాగా చిరంజీవి ఆరోగ్యంపై షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది . నిన్న రాజేంద్రప్రసాద్ కూతురు మరణించిన విషయం తెలిసిందే . ఆ సమయంలో ఆయన ను పరామర్శించడా నికి వెళ్లిన చిరు ఎడ‌మ చేతికి గాయం అయినట్టు కనిపించింది .  అలాగే ఆయన చేతికి బ్యాండేజ్ తో కనిపించారు .

కారు దిగుతున్న సమయంలో ఆ చేతికి గాయం కనిపిస్తుంది . దీంతో మెగాస్టార్ చేతికి ఏమైంది ? అంటూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు . ఇంతకీ ఆ గాయం ఎలా అయింది ? అనేది తెలియాల్సి ఉంది . అయితే చిరంజీవి హీరోగా వ‌స్తున్న విశ్వంభర షూటింగ్లో సమయంలో ఏదైనా యాక్సిడెంట్ జరిగిందా ? ఇంకేదైనా కారణమా అన్నది మెగా ఫ్యామిలీ ధ్రువీకరించాల్సి ఉంది . ప్ర‌స్తుతం చిరంజీవి వ‌య‌సు 69 సంవ‌త్స‌రాలు . అయినా యాక్ష‌న్ స‌న్నివేశాల్లో త‌గ్గేదేలే ? అంటూ ప‌ని చేస్తున్నారు. సైరా న‌ర‌సింహారెడ్డి సినిమా కోసం మెగాస్టార్ ఎంత‌గా శ్ర‌మించారు అన్న‌ది కొత్త‌ చెప్పాల్సిన ప‌న‌లేదు. ఈ వ‌య‌సులో కూడా వార్ స‌న్నివేశాల్లో త‌న‌దైన మార్క్ చూప‌రు.

గుర్ర‌పు స్వారీ , క‌త్తి యుద్దం స‌న్నివేశాల్లో క‌నిపించి ప్రేక్ష‌కుల్ని అల‌రించారు. ఆ త‌ర్వాత సినిమ‌ల్లోనూ యాక్ష‌న్ ఎపిసోడ్లు ఎన్నో చేసారు . కానీ ఏస‌మ‌యం లోనూ గాయాల పాలు కాలేదు . తాజాగా గాయంతో క‌నిపించ‌డంతో విశ్వంభ‌ర షూట్ లోనే ఏదో జ‌రిగి ఉంటుంద‌ని అభిమానులు భావిస్తున్నారు . కానీ చిత్ర యూనిట్ నుంచి మాత్రం ఇలాంటి సంఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు. ఇక మరి చిరంజీవి చేతికి గాయం ఎలా అయింది. అసలు ఆయనకు ఏం జరిగింది అంటూ మెగా అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు. ఇక మరి దీనిపై మెగా ఫ్యామిలీ ఎలాంటి ప్రకటన చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: