వామ్మో: ముంబైలో కేక పుట్టిస్తున్న మంచు లక్ష్మి.. ఫొటోస్ వైరల్..!

Divya
చాలామంది సెలబ్రిటీలు తెలుగు సినీ పరిశ్రమలో సక్సెస్ కాలేక ఇతర భాషలలోకి వెళ్లి సక్సెస్ అయిన వారు ఉన్నారు. అయితే ఇప్పుడు అలాంటి వారి అడుగులలోనే మంచు లక్ష్మి కూడా వేసి  ముంబై ప్రాంతంలో అడుగు పెట్టింది. ముంబైలో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ తన కెరీర్ ని ముందుకు సాగిస్తూ బాలీవుడ్లో పలు రకాల సినిమాలలో నటించే విధంగా ప్లాన్ చేస్తోంది మంచు లక్ష్మి. అయితే తన బర్తడే రేపటి రోజు అయినప్పటికీ ముందుగానే  బర్త్డే పార్టీనీ చేసుకొని అందుకు సంబంధించి ఫోటోలు వైరల్ గా మారడంతో టాలీవుడ్ లో ఈ విషయం హాట్ టాపిక్ గా మారుతున్నది.

మంచు లక్ష్మి హోస్టుగా, నిర్మాతగా, నటిగా కూడా ఎన్నో చిత్రాలలో నటించింది. గత కొన్ని నెలలుగా ముంబైలో నివసిస్తున్న మంచు లక్ష్మి అక్కడే తన స్నేహితులతో కలిసి బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నది. మంచు లక్ష్మి  పుట్టినరోజును ముందుగానే చేసుకుంటూ  కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ గా మారుతున్నాయి. ఈ పార్టీకి మాజీ విశ్వసుందరి సుస్మితసేన్, రకుల్ ప్రీతిసింగ్ ఆమె భర్త అలాగే ప్రగ్యా జైస్వాల్ తదితరులు వచ్చినట్టుగా కనిపిస్తోంది. అయితే వీరంతా చేసిన హంగామా గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈ వేడుకలలో తనదైన స్టైల్ లో కేకలు గుర్తించే విధంగా దుస్తులతో అందాలతో మైమరిపిస్తున్నారు.

ముఖ్యంగా మంచు లక్ష్మి ఎరుపు రంగు ఆఫ్ షోల్డర్ దుస్తులలో మెరిసిపోతూ కనిపిస్తూ ఉన్నది. టు హాట్గా కనిపిస్తోంది మంచు లక్ష్మి.. రకుల్ డిజైనర్ దుస్తులను ధరించింది అలాగే సుస్మితాసేన్ బ్లాక్ కలర్ దుస్తులను ధరించింది. రేపటి రోజున మంచు లక్ష్మి పుట్టినరోజు సందర్భంగా ముంబైలో తన స్నేహితులతో కలిసి ముందుగానే తన బర్తడే పార్టీ సెలబ్రేషన్స్ ని ఇలా చాలా గ్రాండ్గా చేసుకున్నట్లు తెలుస్తోంది. మంచు లక్ష్మి కి ఇలాంటి పార్టీలు కొత్తవి కాదు కానీ తన స్నేహితులతో జరుపుకోవడం ఎప్పుడూ కూడా కొత్తగానే అనిపిస్తూ ఉంటుందట. ప్రస్తుతం ఈ ఫోటోలు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: