శోభిత: పాపం సమంతను చూస్తే జాలేస్తోంది.. అసలు ఎందుకు ఇలా..!?

Anilkumar
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల మిస్ ఇండియాతో కెరీర్ ప్రారంభించి నటిగా ఎదిగారు. ఈ క్రమంలోనే 'గూఢచారి', 'మేడ్ ఇన్ హెవెన్', 'ఘోస్ట్ స్టోరీస్', 'నైట్ మేనేజర్', 'పోన్నియన్ సెల్వన్' వంటి సినిమా/సిరీస్లో కీ రోల్స్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలే కాకుండా తాజాగా హాలీవుడ్లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం అక్కడ కూడా వరస సినిమాలో చేస్తూ దూసుకుపోతోంది. ఇక అక్కినేని కోడలిగా త్వరలో నాగ చైతన్యతో ఏడడుగులు వేయనుంది శోభిత ధూళిపాళ్ల. ఒకవవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లో కూడా నటిస్తుంది శోభిత.  

శోభిత తాజాగా తన సోదరి సమంత గురించి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నాచెల్లి సమంత అంటే నాకు చాలా ఇష్టమని శోభిత తెలిపారు. నా చెల్లి సమంత నా సోల్ మేట్ అని ఆమె పేర్కొన్నారు. ఈ మధ్యనే సమంతకు పెళ్లైంది. సినిమాలు,షూటింగ్స్ లో బిజీగా ఉండడడంతో  కుటుంబానికీ, బంధువులకీ చాలా కాలంగా దూరంగా ఉన్నా. సమంతపెళ్లిలో మళ్ళి అందర్నీ కలుసుకున్నా.పెళ్లి కూతురుగా అందంగా ముస్తాబై మండపంలో కూర్చున్న నా చెల్లి సమంతను చూసినప్పుడు మాత్రం ఆనందంతో కళ్లలో నీళ్లు తిరిగాయి. నాకు భక్తి ఎక్కువే. ఉదయాన్నే పూజ చేయడం,

 సూర్యాష్టకం చదవడం అలవాటు. నేను పూర్తీ శాకాహారిని. ఆవకాయ, పులిహోర, ముద్దపప్పు, పచ్చిపులుసు ఎంతిష్టమో. చిన్నప్పట్నుంచీ అమ్మ కావాలనే కోరిక ఉండేది అని పేర్కొంది. అనంతరం కాబోయే భర్త నాగచైతన్య గురించి శోభిత మాట్లాడుతూ చైతన్య చాలా మర్యాదస్తుడని ఆమె చెప్పుకొచ్చారు. ఇది ఇలా ఉంటే త్వరలో శోభిత అక్కినేని నాగచైతన్యతో ఏడడుగులు వేయబోతున్నారు. ఇటీవలే కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య  చైతన్య, శోభిత నిశ్చితార్థం చేసుకున్నారు. సమంతతో విడిపోయిన మూడు సంవత్సరాల తర్వాత చైతన్య శోభితను పెళ్లి చేసుకోబోతున్నారు. ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: