టెంపర్ సమయంలో ఇన్ని గొడవలు జరిగాయా.. దెబ్బకు ఎన్టీఆర్ అలాంటి నిర్ణయం..?

MADDIBOINA AJAY KUMAR
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొన్ని సంవత్సరాల క్రితం టెంపర్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించగా ... డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. బండ్ల గణేష్ ఈ మూవీ ని నిర్మించాడు. ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ఆ సమయంలో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.

ఇకపోతే ఈ సినిమా సమయంలో ఈ మూవీ నిర్మాత అయినటువంటి బండ్ల గణేష్ తో ఈ సినిమా హీరో జూనియర్ ఎన్టీఆర్ అలాగే ఈ మూవీ కథ రచయిత వక్కంతం వంశీ కి మధ్య గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ కంటే ముందు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన బాద్ షా మూవీ ని బండ్ల గణేష్ నిర్మించాడు. ఆ మూవీ కూడా మంచి విజయం అందుకుంది. ఆ సినిమా సమయం లోనే వీరిద్దరికి మంచి స్నేహం కుదరడంతో బండ్ల గణేష్ నిర్మాణం లో జూనియర్ ఎన్టీఆర్ రెండవ సినిమా కూడా నటించాడు.

కానీ టెంపర్ సినిమా సమయంలో బండ్ల గణేష్ కి జూనియర్ ఎన్టీఆర్ కు మధ్య విభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే టెంపర్ మూవీ కి వక్కంతం వంశీ కథను అందించాడు. ఇక కథను అందించినందుకు గాను ఆయనకు రావలసిన డబ్బులను బండ్ల గణేష్ త్వరగా ఇవ్వలేదు అని , ఆ తర్వాత ఒక చెక్ ఇచ్చాడు. కానీ అది కూడా బౌన్స్ అయ్యింది అని , అలా చాలా కాలం పాటు ఇబ్బంది పెట్టి బండ్ల గణేష్ తనకు రావలసిన మొత్తాన్ని ఇచ్చినట్లు వక్కంతం వంశీ చెప్పుకొచ్చాడు. ఇలా టెంపర్ సినిమా విషయంలో బండ్ల గణేష్ తో జూనియర్ ఎన్టీఆర్ , వక్కంతం వంశీ మధ్య గొడవలు జరిగినట్లు అనేక వార్తలు బయటకు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: