మ‌హేష్ - విజ‌య్‌ను నిండా ముంచేశాడు... ఇప్పుడు సిద్ధు మీద ప‌డ్డాడుగా...!

RAMAKRISHNA S.S.
- ప‌ర‌శురాం - దిల్ రాజు - సిద్ధు జొన్న‌ల గ‌డ్డ ప్రాజెక్ట్ కు ఓకే .. !
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .
పరశురాం.. గీతగోవిందం లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమా తర్వాత ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు. ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు పిలిచి మరి అవ‌కాశం ఇచ్చాడు. మహేష్ బాబు లాంటి స్టార్ హీరో అవకాశం ఇవ్వటమంటే చాలా జాగ్రత్తగా వాడుకుని మహేష్‌కు సూపర్ డూపర్ హిట్ ఇవ్వాలి. కానీ.. పరశురాం సర్కారు వారి పాట సినిమా విషయంలో చేతులు ఎత్తేశాడు. మరియు ముఖ్యంగా సెకండాఫ్ పూర్తిగా తెలిసిపోయింది. ఎవరు ఎన్ని అనుకున్నా.. సర్కారు వారి పాట అంచనాలు అందుకోలేదు.

చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ కాలేదు. ఫలితం చూసి మహేష్ కూడా డిసప్పాయింట్ అయిన మాట వాస్తవం. ఆ తర్వాత దిల్ రాజు బ్యానర్ లో విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ సినిమా చేశాడు. ఫ్యామిలీ స్టార్స్ సినిమా పెద్ద డిజాస్టర్ అయింది. ఇక పై ఆయ‌న‌కు అవకాశాలు ఇస్తారా అన్న చర్చలు కూడా నడిచాయి. అయితే ఫ్యామిలీ స్టార్‌ సినిమా చేసేటప్పుడు దిల్ రాజు కాంపౌండ్ లో మరో సినిమా చేయడానికి పరుశు రాం ఓకే చెప్పాడు.

అలా.. ఇప్పుడు సిద్దు జొన్నలగడ్డకు పరశురామ్‌కు.. దిల్ రాజు ముడిపేసి పెట్టేసినట్టు తెలుస్తోంది. సిద్దు ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో.. తెలుసు కదా అనే మరో ప్రాజెక్టు నడుస్తుంది. ఇవి రెండు పూర్తవుతున్నాయి. ఆ వెంటనే పరశురామ్ దర్శకత్వంలో సినిమా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా ఈ సినిమాతో అయినా పరశురాం హిట్ కొట్టకపోతే పరశు రామ్ ను టాలీవుడ్ జనాలు కచ్చితంగా మర్చిపోవడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: