"రియల్ మగాడికి ఉండాల్సిన ఏకైక లక్షణం అదే"..ఎన్టీఆర్ ఒక్కోక్కడికి రాడ్ దించేశాడుగా..!

Thota Jaya Madhuri
ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా అందరి నోట ఒకే మాట వినిపిస్తుంది. హీరో నాగచైతన్య హీరోయిన్ సమంత విడాకులకు నిజంగానే కేటీఆర్ కారణమా..? ఈ డౌట్ రావడానికి మెయిన్ రీజన్ తెలంగాణ మంత్రి కొండ సురేఖ . రీసెంట్గా ఓ కార్యక్రమంలో పాల్గొన్న కొండా సురేఖ ..కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సమంత - నాగచైతన్య విడాకులపై సంచలన కామెంట్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. నాగచైతన్య - సమంత విడాకులకు 100కి 100% కేటీఆర్ నే కారణం అంటూ బల్లగుద్ది చెప్పేసింది. అంతేకాదు నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్ ని కూల్చోదంటే సమంతను తన దగ్గరికి పంపించాలి అంటూ కేటీఆర్ డిమాండ్ చేశాడు అని చాలా చాలా తీవ్రమైన ఆరోపణలు చేసింది.


కేటీఆర్ డిమాండ్ మేరకే సమంతను కేటీఆర్ వద్దకు పంపాలని నాగార్జున ఫ్యామిలీ బాగా ఒత్తిడి చేసిందట. అలాంటి పనులు చేయడం ఇష్టం లేని సమంత నాగార్జునని ఎదిరించిందట. మేము చెప్పినట్లు వినకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపో అంటూ వార్న్ చేశారట నాగ్ కుటుంబం. ఆ కారణంగానే సమంత - నాగచైతన్య విడాకులు తీసుకున్నారు అని మంత్రి కొండా సురేఖ చాలా చాలా తీవ్రమైన ఆరోపణలు చేసి సినిమా ఇండస్ట్రీని సోషల్ మీడియాని షేక్ చేసి పడేసింది . అయితే సమంత - నాగచైతన్య విడాకుల వ్యవహారం పై మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలను నాగార్జున కుటుంబమే కాకుండా సినిమా ఇండస్ట్రీలో ఉండే పలువురు స్టార్ హీరోలు కూడా తప్పుపట్టారు.  మరి ముఖ్యంగా అన్ని విషయాలలో సైలెంట్ గా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ ఈసారి మాత్రం చాలా చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినట్లే మాట్లాడారు .


ఎక్స్ ట్విట్టర్ వేదికగా జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేస్తూ.." కొండా సురేఖ గారు మీరు ఒక బాధ్యత గల పొజిషన్లో ఉన్నారు. పబ్లిక్ ఫిగర్లు.. ప్రత్యేకించి మీలాంటివారు మాట్లాడేటప్పుడు చాలా ఆచితూచి ఆలోచించి మాట్లాడాలి ..తప్పనిసరిగా గౌరవాన్ని గోప్యతను మెయిన్ టైన్ చేయాలి.. సినిమా పరిశ్రమ గురించి నిర్లక్ష్యంగా నిరాధారమైన ప్రకటనలు చూసి నిరుత్సాహంగా ఉంది. మాపై నిరాధార ఆరోపణలు చేస్తుంటే ఇక చూస్తూ ఊరుకునేది లేదు ..మనం ప్రెసెంట్ ఉన్న స్థాయి కంటే ఇంకా పైకి ఎదగాలి ..ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ఉండాలి. ప్రజాస్వామ్య భారతదేశంలో మన సమాజం అటువంటి నిర్లక్ష్య ప్రవర్తనను సాధారణీ కరించకుండా చూసుకుందాం" అంటూ రాసుకోచ్చాడు .


జనరల్ గా జూనియర్ ఎన్టీఆర్ చాలా విషయాలలో సైలెంట్ గా ఉంటాడు . ముఖ్యంగా రాజకీయాలలో విషయాలలో ఈ మధ్యకాలంలో వేలు పెట్టిందే లేదు . ఏపీలో కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేయలేదు అంటూ ఎన్టీఆర్ ని ఎలా దూషించారో అందరికీ తెలిసిందే. అయితే సమంత - నాగ చైతన్యల గురించి మాత్రం తప్పుగా మాట్లాడేసరికి ఎన్టీఆర్ కి కోపం వచ్చింది. అందుకే లిమిట్స్ క్రాస్ అయిన పర్వాలేదు అంటూ సమంతకి సపోర్ట్ చేస్తూ కొండ సురేఖకు వార్నింగ్ ఇచ్చినట్లే ట్వీట్ చేశాడు .


అయితే ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇదే ట్వీట్ ను తెగ ట్రెండ్ చేస్తున్నారు . ప్రతి చిన్న విషయానికి పనికిమాలిన విషయాలకి రియాక్ట్ అయ్యేవాడు అసలు మగాడే కాదు.. బాధ్యతగల మనిషి రియల్ మగాడు ఎప్పుడు ..ఎలా ..ఎక్కడ రియాక్ట్ అవ్వాలో అక్కడ రియాక్ట్ అవుతాడు. అసలు ఒక మగాడికి ఉండాల్సిన రియల్ ఏకైక లక్షణం అదే అంటూ ఎన్టీఆర్ ను ఓ రేంజ్ లో పొగిడేస్తూ ఎన్టీఆర్ ని ఎవరైతే ట్రోల్ చేశారో వాళ్లకి ఇచ్చిపడేస్తున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ సైలెంట్ గానే తనమీద ట్రోలింగ్ చేసే వాళ్ళకి తనను పరోక్షంగా రాజకీయాల్లోకి లాగి బాధ పెట్టాలి అనుకునే వాళ్లకి సెంటర్ లో రాడ్ దించేశాడు..!




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: