ఫైనల్లీ వేణు స్వామి చెప్పిందే జరగబోతుందిగా.. విడాకులు తీసుకోబోతున్న సీనియర్ స్టార్ కపుల్..!?

Thota Jaya Madhuri
వేణు స్వామి.. గత కొన్ని నెలల వరకు ఈ పేరు ఎలా మారు మ్రోగి పోయిందో అందరికీ తెలిసిందే . ఉన్నది ఉన్నట్లు.. జరగబోయేది జరిగేటట్లు ..చెప్పడమే వేణు స్వామి స్పెషాలిటీ అంటూ చాలామంది మాట్లాడుకున్నారు . ఒక టాప్ మోస్ట్ సెలబ్రిటీకి మించిన రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు వేణు స్వామి అనడంలో ఎటువంటి సందేహం లేదు . వేణు స్వామి చెప్పిన జాతకాలు చాలా వరకు నిజమయ్యాయి అంటూ జనాలు కూడా మాట్లాడుకున్నారు. మరీ ముఖ్యంగా నాగచైతన్య - సమంత ఇష్యూలో హైలెట్ హ్యాండ్ వేణు స్వామిదే అన్న సంగతి అందరికీ తెలిసిందే .


వాళ్ళు విడాకులు తీసుకుంటారు అంటూ వాళ్ల పెళ్లికాకముందే వేణు స్వామి ఓపెన్ గా చెప్పుకు రావడం అందరికీ తెలుసు.  వేణు స్వామి చెప్పినట్లే వాళ్ళిద్దరూ విడిపోయారు. అంతేకాదు మరికొన్ని విషయాలలో కూడా వేణు స్వామి చెప్పినట్లే జరిగింది. పలువురు స్టార్ సెలబ్రిటీస్ పరసనల్ లైఫ్ విషయాలను ఓపెన్ గా చెప్పేయడం వేణు స్వామి స్పెషాలిటీ . అయితే ఈ మధ్యకాలంలో ఆయన చెప్పిన జాతకాలు అటు ఇటుగా ఉండటంతో సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ ఎదుర్కొన్నారు. ఒకప్పుడు వేణు స్వామి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక టాప్ మోస్ట్ సెలబ్రిటీ జంట విడిపోతారు అని.. రాసి పెట్టుకోండి అని బల్లగుద్ది చెప్పారు .


అయితే ఇప్పుడు అదే నిజం కాబోతున్నట్లు తెలుస్తుంది . ఇండస్ట్రీలో ఎంతో చూడ చక్కగా ఉండే ఈ జంట అందరికీ ఆదర్శంగా ఉంటుంది . అయితే పులిని చూసి నక్క వాత పెట్టుకున్న రీతిలో ఈ స్టార్ జంట కూడా విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . సినిమా ఇండస్ట్రీలో  తమకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ జంట కొన్ని మనస్పర్ధలు కారణంగా దూరం దూరంగా ఉంటూ వస్తున్నారు . అయితే ఆ విషయం బయటకు ఎక్కడా పొక్కకుండా జాగ్రత్తలు పడుతున్నారు.


కానీ ఆ విషయం ఎలాగోలా మీడియాకు లీక్ అయిపోయింది . ఆ ఇద్దరు వేరువేరుగా ఉండటమే కాకుండా త్వరలోనే విడాకులు కూడా తీసుకోవాలి అంటూ డిసైడ్ అయ్యారట . కొన్ని మనస్పర్ధలు కారణంగా 17 ఏళ్ల తమ వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పబోతున్నారట. ఇది తెలుసుకున్న ఫ్యాన్స్ షాక్ అయిపోతున్నారు. సమస్యకు విడాకులు పరిష్కారం కాదు అంటూ సలహా ఇస్తున్నారు . కూర్చొని సామరస్యంగా మీ మధ్య ఉన్న ఇష్యూస్ ను సాల్వ్ చేసుకోండి అంటూ సజెషన్స్ ఇస్తున్నారు . అయితే ఈ జంట విడిపోతుంది అంటూ ఎప్పుడో వేణు స్వామి చెప్పుకు రావడం ఇప్పుడు మరొకసారి హైలెట్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: