గోపీచంద్ అయిన ఆ బ్యానర్ను కాపాడుతాడా.. రీసెంట్ మూవీతో కూడా అదే అనుభవం..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో వరుస పెట్టి సినిమాలను నిర్మిస్తున్న బ్యానర్లలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ వారు ఒకరు. ఈ బ్యానర్ నుండి ప్రతి సంవత్సరం చాలా సినిమాలు ఈ మధ్య కాలంలో వస్తూనే ఉన్నాయి. కానీ అందులో విజయాలు సాధిస్తున్న సినిమాల సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉంది. ఈ బ్యానర్ లో రూపొందిన సినిమాలలో ఇప్పటి వరకు చాలా తక్కువ సినిమాలు మాత్రమే విజయాలను అందుకున్నాయి. ఇకపోతే ఈ బ్యానర్ నుండి ఈ సంవత్సరం కూడా చాలానే సినిమాలు విడుదల అయ్యాయి. ఈ బ్యానర్ నుండి ఈ సంవత్సరం ప్రారంభంలో రవితేజ హీరోగా రూపొందిన ఈగల్ మూవీ వచ్చింది.

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఇకపోతే కొంత కాలం క్రితం ఈ బ్యానర్ నుండి రవితేజ హీరోగా రూపొందిన మిస్టర్ బచ్చన్ అనే మూవీ కూడా వచ్చింది. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే కొన్ని రోజుల క్రితం ఈ బ్యానర్ నుండి స్వాగ్ అనే సినిమా వచ్చింది. ఈ మూవీ కి హిట్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుంది అని అంతా అనుకున్నారు. కానీ ఈ మూవీ కి భారీ ఎత్తున కలక్షన్లు మాత్రం రావడం లేదు.

ఇది ఇలా ఉంటే ఈ బ్యానర్ వారు తాజాగా గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో విశ్వం అనే సినిమాను నిర్మించారు. ఈ మూవీ అక్టోబర్ 11 వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాపై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా అయిన మంచి విజయాన్ని అందుకొని ఈ బ్యానర్ కు మంచి సక్సెస్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర అందిస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

gc

సంబంధిత వార్తలు: