మెగాస్టార్: మల్టీస్టారర్ మూవీకి గ్రీన్ సిగ్నల్... కానీ అలాంటి కండిషన్ పెడ్తున్నారా.?

FARMANULLA SHAIK
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సీనియర్ హీరోలు ఇప్పటికి కుర్ర హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తూ హిట్స్ అందుకుంటున్నారు. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ ఎవరి సినిమాలతో వారు ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నారు. చిరంజీవి చివరిగా వాల్తేరు వీరయ్య తో హిట్ అందుకున్నారు. అటు బాలయ్య వీరసింహారెడ్డి తో అలరించారు. వెంకటేష్ రానా నాయుడు వెబ్ సిరీస్ తో ఆకట్టుకున్నారు. నాగార్జున కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమాలు చేస్తున్నారు. అయితే ఈ నాలుగు హీరోలు ఇప్పటికి సక్సెస్ ఫుల్ గా సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. ఇదిలావుండగా మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మాగ్నమ్ ఓపస్ ‘విశ్వంభర’. వశిష్ట దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ UV క్రియేషన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్న సంగతి తేలిసిందే.

ఇదిలా ఉంటే ఇప్పటికీ కూడా ఆయన చాలా కష్టపడుతూ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. తన నుంచి ఒక సినిమా వచ్చిందంటే చాలు ప్రేక్షకులందరిలో విపరీతమైన హైప్ అయితే క్రియేట్ అవుతూ ఉంటుంది. మరి అలాంటి చిరంజీవి తన అభిమానులను సంతోష పెట్టడానికి వాళ్ల కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉంటాడు. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ ఇద్దరు కలిసి ఒక మల్టీ స్టారర్ సినిమాలో నటించడానికి సిద్ధమవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది ఒక వేడుకలో చిరంజీవి ఓపెన్ గా తను వెంకటేష్ తో మల్టీ స్టారర్ సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. దాంతో వెంకటేష్ వాళ్ళ అన్నయ్య అయిన సురేష్ బాబు వీళ్ళ కాంబోలో మల్టీ స్టారర్ సినిమా చేయడానికి ఒక మంచి కథ కోసం వెతుకుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే సురేష్ బాబు సెలక్షన్ అంటే చాలా బాగుంటుంది. కాబట్టి చిరంజీవి కూడా మంచి కథ దొరికితే చేద్దామని చెప్పారట.
ఇక దానికోసమే కొత్త కథలను వింటూ సురేష్ బాబు ఎప్పటికప్పుడు చిరంజీవికి చెబుతూనే వస్తున్నాడట. ఇక రీసెంట్ గా ఒక స్టార్ రైటర్ చెప్పిన కథ సురేష్ బాబుకి నచ్చడంతో చిరంజీవికి కూడా తెలియజేశారట. చిరంజీవి కూడా ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక ప్రస్తుతానికి చిరంజీవి, వెంకటేష్ ఎవరి సినిమాల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు.కాబట్టి వాళ్ల సినిమాలు పూర్తి అయిన తర్వాత ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్ మెంట్ ఇవ్వాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ సినిమాకి దర్శకుడిగా ఎవరు వ్యవహరిస్తున్నారనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. నిజానికి తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్ ని ఈ సినిమా కోసం తీసుకురావాలని సురేష్ బాబు ప్రయత్నం చేస్తున్నాడు.ఇదిలాఉండగా మెగాస్టార్ చిరంజీవి మరియు విక్టరీ వెంకటేష్ 2025 సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద కొమ్ముకాస్తున్నారు. చిరంజీవి ఫాంటసీ యాక్షన్ డ్రామా విశ్వంభరతో వస్తున్నాడు, మరోవైపు వెంకీ పల్లెటూరి డ్రామాతో అలరించబోతున్నాడు. బింబిసార ఫేమ్ వశిష్ట విశ్వంభర దర్శకత్వం వహిస్తుండగా, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి వెంకటేష్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: