అప్ప‌టి స్టార్ హీరోయిన్‌పై మోజుప‌డ్డ నాగార్జున‌... అయినా నో చెప్పేసిందా..?

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .
టాలీవుడ్ సీనియర్ హీరో అమ్మాయిల కలల రాకుమారుడు అందాల మన్మధుడు నాగార్జునకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరియు ముఖ్యంగా నిన్నే పెళ్లాడుతా లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమా తర్వాత నాగార్జునకు తెలుగు ప్రేక్షకుల లో మరియు ముఖ్యంగా అమ్మాయిలలో ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. సంతోషం - మన్మధుడు - నేనున్నాను లాంటి సినిమాల తర్వాత నాగార్జునకు అమ్మాయిలలో ఎక్కడా లేని క్రేజ్ వచ్చేసింది. మరి ముఖ్యంగా అప్పట్లో బాలీవుడ్ లో టాప్ హీరోయిన్గా ఉన్నవారిలో చా లామందిని నాగార్జున టాలీవుడ్కు తీసుకువచ్చి తన సినిమాలలో నటింపజేశాడు.

ఊర్మిళా మండోత్కర్ - మనీషా కొయిరాలా - సుస్మితాసేన్ - గ్రేసీ సింగ్ ఇలా చాలామంది స్టార్ హీరోయిన్లు నాగార్జున పక్కన నటించారు. ఈ క్రమంలోని అప్పట్లో బాలీవుడ్ ను ఒక ఊపు ఊపేసిన ఒక స్టార్ హీరోయిన్ ను కూడా తన సినిమాలో పెట్టుకోవాలని టాలీవుడ్ కు తీసుకురావాలని నాగార్జున చాలా ప్రయత్నాలు చేశాడట అయితే ఆమె మాత్రం నాగార్జున్ షాక్ ఇచ్చింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు మాధురి దీక్షిత్  బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పదేళ్లకు పైగా ఒక వెలుగు విరిగింది. ఆ టైంలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్‌ పై నాగార్జున స్వయంగా నిర్మించిన తన సొంత సినిమాలో తన పక్కన హీరోయిన్గా మాధురి దీక్షిత్ ను అడిగారట.

అప్పట్లోనే ఆమె కోటి రూపాయల రెమ్యునరేషన్ అడగడంతో పాటు కేవలం 20 రోజులు మాత్రమే డేట్ లో ఇస్తానని చెప్పేసిందట. ఆ దెబ్బకు దిమ్మతిరిగిన నాగార్జున మ‌రో హీరోయిన్‌ తో ఆ సినిమా పూర్తి చేసేశారు. అలా మాధురి దీక్షిత్ పై మోజుపడి ఆమెతో సినిమా చేయలేని ఆశపడ్డ నాగర్జునకు ఆమె అదిరిపోయే షాక్ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: