శ్రీదేవి మరణం వెనుక ఆయన హస్తం.. షాకింగ్ సీక్రెట్ బయటపెట్టిన శ్రీదేవి చెల్లెలు.?

Pandrala Sravanthi
దివంగత నటి శ్రీదేవి మరణించిన కూడా ఇంకా అభిమానుల మదిలో ఎప్పటికీ బతికే ఉంటుంది.ఎందుకంటే ఆమె నటన అలాంటిది..ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్న ఈ ముద్దుగుమ్మ మరణించి ఇన్ని సంవత్సరాలు అయినా ఇప్పటికీ ఆమెను గుర్తు చేసుకునే అభిమానులు లక్షల్లో ఉన్నారు. అయితే అలాంటి శ్రీదేవి మరణించిన సమయంలో ఆమెపై ఎన్నో రూమర్లు, ఊహగానాలు మీడియాలో వినిపించాయి.ముఖ్యంగా ఆమెది సహజ మరణం కాదని,ఆమె పేరుపై ఉన్న 100 కోట్ల ఇన్సూరెన్స్ కోసం బోనీకపూర్ చంపించాడు అనే వార్తలు కూడా వినిపించాయి. ఇలా శ్రీదేవి మరణ వార్తలపై ఎన్నో రూమర్లు వినిపించాయి. అయితే శ్రీదేవి మరణించిన చాలా రోజుల తర్వాత ఓ సందర్భంలో శ్రీదేవి మరణానికి సంబంధించిన ఒక షాకింగ్ విషయాన్ని బయట పెట్టారు బోనీ కపూర్.  శ్రీదేవి డైటింగ్ ఎక్కువగా చేయడం వల్లే తొందరగా నీరసపడిపోయేది.ఆమె ఎక్కువగా లైట్ ఫైట్ ఫుడ్ మాత్రమే తీసుకునేది.ముఖ్యంగా పళ్ళ రసాలు ఎక్కువగా తాగేది. 

ఆమె కఠినమైన డైటే ఆమె ప్రాణాలకి ముప్పయింది.చాలాసార్లు శ్రీదేవి కళ్ళు తిరిగి పడిపోయేది. అలా అన్ కన్షియన్స్ కి వెళ్లిన తర్వాత చాలా సేపటి వరకు స్పృహలోకి వచ్చేది కాదు. ఇక ఆరోజు శ్రీదేవి మరణించిన సమయంలో కూడా బాత్ టబ్ లో దిగేముందు స్పృహ కోల్పోయింది. దాంతో అలానే నీటిలో మునిగి చనిపోయింది అంటూ షాకింగ్ విషయాన్నీ బయట పెట్టారు.అయితే తన అక్క శ్రీదేవి మరణం పై తాజాగా సీనియర్ నటి మహేశ్వరి సంచలన కామెంట్స్ చేసింది. ఇక నటి మహేశ్వరి అంటే అందరికీ తెలిసిన హీరోయినే.

ఈమె చాలా సంవత్సరాలు ఇండస్ట్రీలో రాణించింది.ఇక ఇప్పుడు కూడా శ్రీదేవి కూతుళ్ళతో అప్పుడప్పుడు మీడియా కంట పడుతూ ఉంటుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని శ్రీదేవి మరణం పై మాట్లాడుతూ.. మా అక్క శ్రీదేవి మరణం పై ఇప్పటికే ఎన్నో ఊహగానాలు వినిపించాయి. ఆమెది సహజ మరణం కాదని,ఆమెను హత్య చేశారనే వార్తలు రాశారు. కానీ అందులో ఎలాంటి నిజం లేదు.మా అక్క శ్రీదేవిది సహజ మరణమే. బాత్ టబ్ లో మునిగే చనిపోయింది అంటూ షాకింగ్ సీక్రెట్ ని బయట పెట్టింది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: