పవన్.. మహేష్ సినిమాల వల్ల బలైన డిస్ట్రిబ్యూటర్.. ఒకే సంవత్సరంలో ఏకంగా అన్ని కోట్ల నష్టం..?

MADDIBOINA AJAY KUMAR
సినిమా ఇండస్ట్రీలో అందరికంటే డేంజర్ జోన్లో డిస్ట్రిబ్యూటర్ కెరియర్ ఉంటుంది అనే చాలా మంది చాలా సందర్భాలలో చెప్పారు. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నిర్మాతగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో దిల్ రాజు ఒకరు. ఈయన డిస్ట్రిబ్యూటర్ గానే తన కెరీర్ ను మొదలు పెట్టాడు. కొన్ని రోజుల క్రితం దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా ఆయనకు మీరు కేవలం డిస్ట్రిబ్యూటర్ గా మాత్రమే ఇండస్ట్రీలో కొనసాగి ఉంటే ఇన్ని సంవత్సరాల కెరియర్ను ఇండస్ట్రీలో కొనసాగించే గలిగేవారా అనే ప్రశ్న ఆయనకు ఎదురయింది.

దానికి ఆయన సమాధానం చెబుతూ ... ఒక వేళ సినిమా ఇండస్ట్రీలో కేవలం డిస్ట్రిబ్యూటర్ గా మాత్రమే కొనసాగి ఉంటే నేను ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉండేవాడిని కాదు. నిర్మాతగా కూడా సినిమాలు చేస్తున్నాను కాబట్టి ఇన్ని సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో కొనసాగుతున్నాను. ఉదాహరణకు చెప్పాలి అంటే ఒక సంవత్సరం నేను తీసిన సినిమాలలో చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. ఆ మూవీల ద్వారా నాకు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చాయి.

ఇక అదే సంవత్సరం నేను పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన అజ్ఞాతవాసి , మహేష్ బాబు హీరోగా రూపొందిన స్పైడర్ మూవీ లకి డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించాను. ఇకపోతే ఈ సినిమాలకు సంబంధించిన థియేటర్ హక్కులను నేను చాలా భారీ ధరకు కొనుగోలు చేశాను. ఆ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఆ రెండు మూవీల ద్వారానే నాకు 25 కోట్ల నష్టం వచ్చింది. కేవలం నేను డిస్ట్రిబ్యూటర్ మాత్రమే అయితే ఆ నష్టాన్ని భరించలేకపోయేవాడిని. నేను నిర్మాతగా సంపాదించిన డబ్బులను ఆ సినిమాల నష్టాలను పూడ్చడానికి ఉపయోగపడింది అని దిల్ రాజు దిల్ రాజు తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: