సమంత.. రకుల్ ఆ చిన్న మిస్టేక్ చేసి ఉండకపోతే బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అయ్యోవరా..?

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న హీరోయిన్లలో సమంత , రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఉన్నారు. వీరిద్దరు కూడా కెరియర్ బిగినింగ్ లో చేసిన కొన్ని తప్పుల వల్ల బాలీవుడ్ ఇండస్ట్రీలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ను సంపాదించుకునే అవకాశాన్ని వదులుకున్నారు. ఆ మిస్టేక్స్ ఏమిటి అనే వివరాలను తెలుసుకుందాం.
కొన్ని సంవత్సరాల క్రితం హిందీలో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ అనే సినిమా వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఆలియా భట్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఈ మూవీ ద్వారా ఆలియా భట్ కు కూడా అద్భుతమైన గుర్తింపు లభించింది. ఈ మూవీ తర్వాత ఈమె అనేక హిందీ సినిమాలలో నటించి ప్రస్తుతం హిందీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా కెరియర్ను కెరీర్ను కొనసాగిస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ అవకాశం మొదట సమంత కు వచ్చిందట. కానీ ఆమె ఈ సినిమాను రిజెక్ట్ చేయడంతో ఆ ఆఫర్ ఆలియా కు వెళ్లిందట. ఇక సమంత ఈ సినిమా చేసి ఉంటే హిందీ సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా కెరియర్ను సాగించేది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.
కొన్ని సంవత్సరాల క్రితం ధోని ఆన్ టోల్డ్ స్టోరీ అనే మూవీ హిందీ లో వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరో గా నటించిన ఈ మూవీ లో కియారా అద్వానీ హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ సినిమా ద్వారా కియారా కు కూడా సూపర్ సాలిడ్ గుర్తింపు లభించింది. ఇకపోతే ఈ మూవీ లో మొదటగా హీరోయిన్ అవకాశం కియారా కు కాకుండా రకుల్ ప్రీత్ సింగ్ కి వచ్చిందట. ఆ సమయంలో ఈమె బ్రూస్ లీ సినిమా చేస్తూ ఉండడంతో ఈ మూవీ ని రిజెక్ట్ చేసిందట. ఇక ఈ సినిమా కనుక రకుల్ చేసి ఉంటే ప్రస్తుతం హిందీ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగించేది అని కొంత మంది జనాలు అభిప్రాయ పడుతున్నారు.
ఇలా సమంత , రకుల్ కెరీర్ బిగినింగ్ లో బ్లాక్ బాస్టర్ హిందీ సినిమాల ఆఫర్లను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఒక వేళ వీరు ఆ సినిమాలను చేసి ఉంటే ప్రస్తుతం వీరు హిందీ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్లుగా కెరియర్ను కొనసాగించేవారు అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: