ఎస్ఎస్ఎంబి : కథకే రెండేళ్ల సమయం.. ఈ లెక్కన మహేష్ కి మోక్షం ఎప్పటికో..?

murali krishna
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ సినిమా ఇంకా మొదలు కాలేదు..ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత మహేష్ తో సినిమా చేస్తున్నట్లు రాజమౌళి  ప్రకటించారు.. రాజమౌళి సినిమా కోసం మహేష్ తన మేకోవర్ చేంజ్ చేసుకునే పని లో వున్నాడు.. గత కొన్ని నెలలు గా జిమ్ లో తీవ్రమైన వర్కౌట్ లు చేస్తూ కఠినమైన డైట్ పాటిస్తున్నాడు.. అలాగే గుబురు గడ్డంతో మహేష్ సరికొత్తగా కనిపిస్తున్నాడు.. రాజమౌళి సినిమా కోసం మహేష్ ఇంతలా కష్టపడుతుంటే రాజమౌళి మాత్రం సినిమాపై ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.. ఈ సినిమా అప్డేట్ కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. తాజాగా రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఈ సినిమా గురించి కీలక అప్డేట్ ఇచ్చారు.. 

ఈ సినిమా కు ఆయన కథా రచయితగా పని చేస్తున్నారు.. ఈ సినిమా కథను అద్భుతంగా మలచడానికి రెండేళ్లు పట్టింది.. రాబోయే జనవరిలో ఈ సినిమా అధికారికంగా మొదలు కానుందని ఆయన చెప్పుకొచ్చారు.. దీనితో మహేష్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.. కానీ వాళ్ళ మైండ్ లో ఒకటే డౌట్ కథ రాయడానికే రెండేళ్లు పడితే సినిమాకు ఎన్నేళ్లు పడుతుందో.. ఈ లెక్కన మహేష్ కు ఇప్పుడల్లా మోక్షం కష్టమేనా అని ఫ్యాన్స్ భావిస్తున్నారు..అయితే లేట్ అయినా కానీ రాజమౌళి మహేష్ కు కెరీర్ లో నిలిచిపోయే మూవీ ఇస్తాడని కొంతమంది ఫ్యాన్స్ భావిస్తున్నారు.. అయితే రాజమౌళి సినిమా కోసం మహేష్ ఏకంగా మూడు సంవత్సరాలు ఫ్యాన్స్ దూరంగా ఉండనున్నాడనే వార్తతో  ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు.. కానీ తప్పని పరిస్థితి పాన్ వరల్డ్ మూవీ కావాలంటే ఆ మాత్రం ఎదురు చూడాల్సిందే..జనవరిలో భారీ ప్రెస్ మీట్ నిర్వహించి ఈ సినిమా గురించి రాజమౌళి ప్రేక్షకులకు ఒక క్లారిటీ ఇవ్వనున్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: