టాలీవుడ్ లెజెండ్రీ నటి నిర్మలమ్మ మనవడు ఎవరు.. సినిమాల్లో నటించాడా..!?

Amruth kumar
ఇక మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎప్పటికీ మర్చిపోలేని అలనాటి నటి నిర్మలమ్మ.. నాటక రంగం నుంచి సినిమా రంగంలో అడుగుపెట్టిన ఆమె తన సహజ నటన తో ప్రేక్షకుల హృదయాలలో ఎప్పటికీ చెరగని ముద్ర వేసుకున్నారు . ముందుగా హీరోయిన్ గా నటించి , ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ,కొనసాగారు . సినిమాల్లో వచ్చే ముఖ్యమైన పాత్రలో కాకుండా సైడ్ రూల్స్ పోషించి వాటితోనే తన నటనతో మెప్పించారు . అప్పట్లోనే హీరోయిన్లకు సమానంగా రెమ్యూనరేషన్ తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.

ఎన్టీఆర్ , నాగేశ్వరరావు , చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున , కమలహాసన్ వంటి అగ్ర‌ హీరోలకు తల్లిగా, నాయనమ్మ పాత్రలు పోషించింది.. దాదాపు తెలుగులోనే 1000కు పైగా సినిమాల్లో ఆమె నటించి కొట్లాది మంది అభిమానులను సొంతం చేసుకోంది .. తన చివరి శ్వాస వరకు సినిమానే ప్రపంచంగా బతికారు నిర్మలమ్మ.సినిమాల ద్వారా ప్రేక్షకులకు నిర్మలమ్మ గాని అందరికీ తెలుసు.. కానీ ఆమె జీవితం గురించి చాలా మందికి తెలియదు. అయితే నిర్మలమ్మ గారు ప్రొడక్షన్ మేనేజర్ కృష్ణారావును వివాహం చేసుకున్నారు. వీరికి పిల్లలు పుట్టలేదు. దాంతో కొన్నాళ్లపాటు మానసిక ఒత్తిడికి లోనయ్యారు నిర్మలమ్మ ఆ తర్వాత కొద్ది రోజులకు కవిత అనే అమ్మాయిని దత్తత తీసుకుంది .

ఆమె పెళ్లిని నిర్మలమ్మ దంపతులు దగ్గరుండి జరిపించారు .. కాగా ఆమెకు ఓ కుమారుడు జన్మించాడు అతని పేరు విజయ్‌ మాదాల. నిర్మలమ్మ వారసుడిగా  విజయ్ మాదాల పడమట సంధ్యారాగం అనే సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆయన చిన్నప్పటి నుంచి అమెరికాలో పెరగటం వల్ల ఆయనకి తెలుగు సరిగ్గా మాట్లాడటం వచ్చేది కాదు. దాంతో సినిమాల్లో అంతగా రాణించలేకపోయారు. విజయ్ మాదాల శోభ అనే అమ్మాయితో వివాహం కాగా వీరికి ప్రియా అనే కూతురు కూడా జన్మించింది. నిర్మలమ్మ 2009లో 89 ఏళ్ళ వయసులో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: