ఆ సినిమా రీ రిలీజ్ కోసం రేణు దేశాయ్ పవన్ కే వార్నింగ్ ఇచ్చింది గా..!

Amruth kumar
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండో భార్య రేణు దేశాయ్ విడాకులు తీసుకుని చాలా కాలమైంది. అయితే సోషల్ మీడియాలో వీరి గురించి ఎప్పుడూ ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. అలాగే రేణు దేశాయ్ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పిల్లల గురించి ఎన్నో విషయాలు చెబుతూ ఉంటుంది. అలాగే కొన్ని ఆసక్తికర పోస్టులు కూడా పెడుతూ ఉంటారు. భార్యా భర్తలుగా పవన్ - రేణు విడిపోయినప్పటికీ పిల్లల విషయంలో మాత్రం ఎంతో బాధ్యతగా ఉంటూ వస్తున్నారు. అలాగే తనకు సందర్భం వచ్చినప్పుడల్లా రేణుదేశాయ్‌, పవన్ కళ్యాణ్ సినిమాల గురించి రాజకీయాల గురించి మాట్లాడుతూనే ఉంటారు. ఇక పవన్ , రేణు దేశాయ్ బద్రి , జానీ సినిమాల్లో కలిసి నటించారు.

ఇక ఆ వాటిలో బద్రి సూపర్ హిట్ అవ్వగా జానీ ప్లాప్‌ అయింది. అలాగే బద్రి సినిమాలో పవన్ నటన మ్యానరిజమ్స్ ఇప్పటికీ ప్రేక్షకులను యువతను కట్టిపడేస్తాయి. అలాగే పవన్ కళ్యాణ్ మేడ మీద చేయి పెట్టుకోవటం ఈ సినిమా నుంచి మొదలయ్యింది. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ బాగా నడుస్తుంది. ఇప్పటికే పవన్ నటించిన జల్సా , ఖుషి , గబ్బర్ సింగ్ లాంటి సినిమాలు రీ రిలీజ్ అయి ప్రేక్షకులను అలరించాయి. ఇదే క్రమంలో రేణు దేశాయ్ మాత్రం బద్రి సినిమా ఎప్పుడు రీరిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారట. ఓ ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ తన మనసులో మాటను బయటపెట్టారు.

ఇక బద్రి సినిమాలో పవన్ , ప్రకాష్ రాజ్ కి వార్నింగ్ ఇచ్చే సన్నివేశం మూవీకి హైలెట్... అలాగే ఆ ఒక్క సీన్తో పవన్ కి అభిమానిగా మారిపోయిందట రేణు దేశాయ్. అలాగే అది ఆమెకు ఫేవరెట్ సీన్ అంటూ కూడా ఆమె చెప్పకు వచ్చింది. బద్రి మూవీ అంత పెద్ద హిట్ అయ్యాక కూడా రేణు దేశాయ్ ఎక్కువగా సినిమాల్లో నటించలేదు. పవన్ తో జానీ చిత్రం చేశారు. ఖుషి, గుడుంబా శంకర్, బాలు లాంటి చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా, ప్రొడక్షన్ డిజైనర్ గా, ఎడిటర్ గా పనిచేశారు. తనకి నటనపై కంటే ఫిలిం మేకింగ్ పైనే ఎక్కువ ఆసక్తి ఉండేది అని రేణు దేశాయ్ తెలిపారు. రేణు దేశాయ్ కోరుకున్నట్లు బద్రి చిత్రం ఎప్పుడు రీ రిలీజ్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: