టాలీవుడ్ లో డైరెక్టర్ నుంచి హీరోగా మారాడు.. కానీ ఇప్పుడు ఈయన చూస్తే అస్సలు గుర్తుపట్టలేరూ?

praveen
సాధారణంగా సినీ సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అందుకే వారికి సంబంధించిన ఏ విషయం తెరమీదకి వచ్చినా కూడా ఇట్టే వైరల్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సెలబ్రిటీలకు సంబంధించిన ప్రొఫెషనల్ విషయాలు మాత్రమే కాదు.. పర్సనల్ విషయాలు తెలుసుకునేందుకు కూడా అందరూ ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు.

 ఈ క్రమంలోనే ఒకప్పుడు ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన వారు ఆ తర్వాత కనుమరుగైతే.. ఇక వారికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోతూ ఉంటాయి. అయితే పూర్తిగా మారిపోయిన ఆయా సెలబ్రిటీలను చూసి అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి ఫోటో ఒకటి వైరల్ గా మారిపోయింది. ఆయన పేరు చెబితే ఇండస్ట్రీ రికార్డులు వనికి పోయేవి. ఎక్కడ బద్దలవుతామో అని. ఆయన పేరు చెబితే హీరోలకు ధైర్యం వచ్చేది.. ఎందుకంటే ఆయనతో సినిమా తీస్తే హిట్టు కొట్టొచ్చు అని.

 ఎంతోమంది హీరోలను స్టార్ హీరోలను చేసాడు. స్టార్ హీరోలను మాస్ హీరోలుగా మలిచాడు. ఆయన కూడా హీరోగా ఓ సినిమా చేశాడు. కానీ ఇప్పుడు గుర్తు పట్టలేనంతగా మారి పోయారు. ఆయన ఎవరో కాదు స్టార్ డైరెక్టర్ వివి వినాయక్. ఈయన గురించి పరిచయమే అక్కర్లేదు. చిరంజీవి ఎన్టీఆర్ బాలకృష్ణ లాంటి స్టార్ హీరోలతో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించారు. ఇక ఆయన మధ్యలో వెయిట్ తగ్గి తన లుక్ మొత్తం మార్చుకొని సీనయ్య అనే సినిమాలో నటించాడు. అది పెద్దగా హిట్ కాలేదు. ఇక గత కొంతకాలం నుంచి సినిమాలకు దూరంగానే ఉన్నారు ఆయన. అనారోగ్యంతో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇటీవల ప్రభాస్ తో  దిగిన ఫోటో వైరల్ గా మారగా ఇది చూసి వివి వినాయక్ ని గుర్తుపట్టలేకపోతున్నారు నేటిజన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: