"అందరూ చూస్తుండగానే అలాంటి పని"..చిరంజీవికే చెమటలు పట్టించిన స్టార్ హీరోయిన్..!

Thota Jaya Madhuri
మెగాస్టార్ చిరంజీవి అన్న పేరు వింటేనే ఒక వైబ్రేషన్స్ వస్తుంటాయి. ఇండస్ట్రీలోకి హీరోగా  వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఎటువంటి హెల్ప్ లేకుండా స్టార్ గా ఎదిగాడు . కష్టం - కృషి - పట్టుదలనే నమ్ముకొని ఆయన ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదిగిపోయారు . ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలి అని చిరంజీవి దగ్గర చూసే నేర్చుకోవాలి. అందరూ సినీ ఇండస్ట్రీకి పెద్దదిక్కు మెగాస్టార్ చిరంజీవి అంటూ ఉంటే మెగాస్టార్ మాత్రం నేను పెద్దదిక్కు కాదు ..నాకు తోచిన సహాయం చేస్తాను అంతే అంటూ చాలా సింప్లి సిటీ గా మాట్లాడుతుంటారు .


ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ అందరి హీరోయిన్స్ తో స్క్రీన్ చేసుకొని చిందులేసిన చిరంజీవి అందరికంటే బాగా మంచిగా డాన్స్ చేస్తాడు అని చాలామందికి హీరోయిన్స్ చెప్పుకు వచ్చారు. అయితే చిరంజీవికి చెమటలు పట్టించింది ఒక స్టార్ హీరోయిన్ అని స్వయంగా మెగాస్టార్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు . ఆమె మరెవరో కాదు బాలీవుడ్ బ్యూటీ "సమీరా రెడ్డి".  చిరంజీవి హీరోగా సమీరా రెడ్డి హీరోయిన్ గా నటించిన సినిమా జై చిరంజీవ . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేసింది.  మరి ముఖ్యంగా చిరంజీవి డ్యూయెల్ షేడ్ పర్ ఫామెన్స్ సినిమాకి హైలెట్ గా నిలిచింది .


ఈ సినిమాకి "మహ ముద్దొచ్చేస్తున్నావోయ్ ..కోకో కోడి బాగుంది"... ఈ రెండు పాటలు చాలా చాలా హైలెట్గా నిలిచాయి . అయితే ఈ రెండు పాటలకు స్టెప్స్ వేసే విషయంలో చిరంజీవి ..సమీరా రెడ్డిని బీట్ చేయలేకపోయాడు . మరీ ముఖ్యంగా మహ ముద్దు వచ్చేస్తున్నావోయ్ సాంగ్ షూటింగ్ టైంలో చిరంజీవి కంటే డబుల్ స్పీడ్ గా ఎనర్జీతో సమీరారెడ్డి స్టెప్స్ ను చకచగా వేసిందట . ఇప్పటివరకు చిరంజీవి ఏ సినిమాలో కూడా స్టెప్స్ విషయంలో అంత కష్టపడలేదట.  సమీరా రెడ్డి చాలా బాగా స్టెప్స్ ని పట్టేసి చిరంజీవి కంటే ఫాస్ట్ గా చేసేసిందిట . చిరంజీవి సైతం ఆమెకు కాంపిటీషన్ ఇవ్వాలి అంటూ గట్టిగా ట్రై చేశాడట . ఇక తన వల్ల కాదు అంటూ  చెమటలతో కుర్చీలో కూర్చుండిపోయాడట . అలాంటి హార్డ్ స్టెప్స్ ని కూడా యమ ఫాస్టుగా చిరంజీవిని మెప్పించే విధంగా చేసింది . ఈ విషయాన్ని స్వయానా చిరంజీవినే ఓ  ఇంటర్వ్యూలో చెప్పుకు రావడం విశేషం..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: