హిట్లు ఉన్న బాలయ్య అభిమానులకు ఫుల్ డిసప్పాయింట్మెంట్.. ఎందుకంటే..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన సీనియర్ హీరోలలో నందమూరి బాలకృష్ణ ఒకరు. ఈయన సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి 50 సంవత్సరాలు పూర్తి అయిన కూడా అద్భుతమైన జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తున్నాడు. ఇకపోతే కొంత కాలం క్రితం వరుసగా అపజయాలను ఎదుర్కొన్న బాలయ్య "అఖండ" మూవీ దగ్గర నుండి వరస పెట్టి విజయాలను అందుకుంటూ వస్తున్నాడు. అఖండ మూవీ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న బాలకృష్ణ ఆ తర్వాత వీర సింహా రెడ్డి , భగవంత్ కేసరి సినిమాలతో కూడా విజయాలను అందుకొని ప్రస్తుతం ఫుల్ జోష్లో ఉన్నాడు. ఇకపోతే ప్రస్తుతం బాలయ్య , బాబి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

ఈ మూవీ పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే బాలయ్య కు వరుస విజయాలు వస్తున్నా కూడా ఒక విషయంలో మాత్రం ఆయన ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అవుతున్నట్లు తెలుస్తోంది. అది ఎందులో అంటే దాదాపు టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న యంగ్ స్టార్ హీరోలు అంతా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ వస్తున్నారు. ఇక తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే సైరా నరసింహా రెడ్డి అనే సినిమాతో చాలా సంవత్సరాల క్రితమే పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటించాడు.

ఈ మూవీ తో పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని కూడా ఇండియా వ్యాప్తంగా దక్కించుకున్నాడు. దానితో బాలయ్య అభిమానులు కూడా తమ అభిమాన హీరో ఒక పన్ ఇండియా సినిమాలో నటించి దానితో అద్భుతమైన విజయాన్ని అందుకుంటే బాగుంటుంది అని ,  ఆ దిశగా ఆయన ప్రయత్నాలు చేస్తే ఇంకా బాగుంటుంది అని ఆయన అభిమానులు అభిప్రాయ పడుతున్నట్లు తెలుస్తోంది. మరి బాలయ్య పాన్ ఇండియా సినిమాల వైపు ముగ్గు చూపుతాడా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: