సమంతకు అక్టోబర్ నెల శాపంగా మారిందా.. ఇదెక్కడి విడ్డూరం రా బాబు..?

Amruth kumar
టాలీవుడ్ లో ఏం మాయ చేసావే సినిమా తో హీరోయిన్‌గా అడుగుపెట్టి తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్న హీరోయిన్ సమంత .. ఆ తర్వాత చాలా మంది స్టార్ హీరోల తో కలిసి నటించింది . అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ మధ్య కాలంలో అటు సోషల్ మీడియాలోనూ ఇటు ఇండస్ట్రీలోనూ తనకు సంబంధం లేని వివాదాల్లో చిక్కుకుంటూ హాట్ టాపిక్‌గా మారుతున్న విషయం తెలిసింది.

ముఖ్యంగా తన మాజీ భర్త నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత ఎక్కువ విమర్శలు ఎదుర్కొంటుంది. విడాకులు తీసుకున్న అప్పటినుంచి ఈ విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రధానంగా సమంత - నాగచైతన్య విడిపోయినప్పుడు విడాకులకు గల కారణాలను వీరిద్దరూ ఎక్కడ వివరించలేదు. దాంతో చాలామంది సమంత అదే తప్పని ఆమెపై విమర్శలు గుప్పించారు. దీనికి తోడు తెలంగాణ  మంత్రి కొండ సురేఖ కూడా సమంత పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆమెను వార్త‌ల్లోకి లాగేసింది. ఇలా ఎప్పటికప్పుడు సమంత వార్తల్లో హాట్ టాపిక్ గా మారుతున్న నేపథ్యంలో.. అసలు సమంతకు అక్టోబర్ నెల శాపంగా మారిందంటూ సోషల్ మీడియాలో కొంతమంది పోస్టులు చేస్తున్నారు.

ప్రధానంగా అక్టోబర్ నెల ఈమెకు అసలు ఎప్పుడు కలిసి రాలేదంటూ కూడా అంటున్నారు. దాదాపు 7 ఏళ్లపాటు ప్రేమించిన నాగచైతన్యను అక్టోబర్ 6 2017 లో వివాహం చేసుకున్నారు. అయితే ఆ తర్వాత మనస్పర్ధలు రావడంతో 2021 అక్టోబర్ రెండో తేదీన వీరిద్దరు విడిపోతున్నట్లు ప్రకటించారు. అంతే కాకుండా అక్టోబర్లోనే కొండా సురేఖ సమంతా పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వీటన్నింటినీ  బట్టి చూస్తే అక్టోబర్ నెల సమంతకు పెద్ద శాపంల మారింది. ఇక సమంత సినిమాలు విషయానికి వస్తే హనీ బన్నీ వెబ్ సిరీస్ తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు నిర్మాతగా కూడా మారి మా ఇంటి బంగారం అనే సినిమాను కూడా నిర్మిస్తుంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: