టీజర్ చూసి జాన్వీ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కేకోకేక.!

FARMANULLA SHAIK
వశిష్ట డైరెక్షన్లో చిరంజీవి చేస్తున్న సినిమాకి సంబంధించిన టీజర్ ని దసర కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.చిరంజీవి చాలా సంవత్సరాల తర్వాత నటిస్తున్న భారీ సోషియో ఫాంటసీ సినిమా 'విశ్వంభర'. నిన్న మొన్నటి వరకు ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ చెబుతూ వచ్చారు. కానీ షూటింగ్ ఆలస్యం అవ్వడంతో పాటు, వీఎఫ్‌ఎక్స్ వర్క్‌ ఎక్కువ ఉండటం వల్ల సమ్మర్‌కి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. విశ్వంభర సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకోవడంతో ఆ స్థానంలోకి మెగా చిరుత రామ్ చరణ్‌ గేమ్‌ ఛేంజర్ వచ్చిన విషయం తెల్సిందే. సంక్రాంతికి విశ్వంభర లేదని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్న సమయంలో దసరా కానుకగా టీజర్ ను విడుదల చేశారు.దసరా కానుకగా వచ్చిన టీజర్ కి ఫ్యాన్స్ నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్ వచ్చింది. సోషల్‌ మీడియాలో ఎప్పటిలాగే కొందరు ట్రోల్స్ చేస్తూ ఉంటే మొత్తంగా టీజర్‌ కి మంచి స్పందన వచ్చింది. తాజాగా టీజర్‌ ను జాన్వీ కపూర్‌ చూస్తూ విజువల్స్ కి షాక్ అయిన వీడియోను దర్శకుడు బుచ్చిబాబు షేర్‌ చేశారు. బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో చరణ్‌ కి జోడీగా జాన్వీ కపూర్‌ నటించబోతున్న విషయం తెల్సిందే. స్క్రిప్ట్‌ చర్చల సందర్భంగా బుచ్చిబాబు నేడు విడుదల అయిన విశ్వంభర టీజర్ ను జాన్వీ కపూర్ కి చూపించడం జరిగింది. ఆ సమయంలో జాన్వీ కపూర్ షాక్ అయింది.


జగదేక వీరుడితో అతిలోక సుందరి కూతురు జాన్వీ కపూర్‌ విశ్వంభర టీజర్ చూస్తుంది అంటూ సోషల్‌ మీడియాలో ఈ వీడియోను షేర్ చేశారు. చరణ్‌, జాన్వీ కపూర్ జోడీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దేవర సినిమాలో హీరోయిన్‌ గా నటించి జాన్వీ కపూర్ అందంకి మంచి మార్కులు పడ్డాయి. అంతే కాకుండా చరణ్ మూవీలో ఈమె అందంతో పాటు నటనతో మెప్పించడం ఖాయం అనే అభిప్రాయంను నెటిజన్స్ తో పాటు అంతా వ్యక్తం చేస్తున్నారు. జాన్వీ కపూర్ టాలీవుడ్‌లో బుచ్చిబాబు సినిమాతో తన మార్క్ ను వేయడం ఖాయం అని శ్రీదేవి ఫ్యాన్స్ సైతం నమ్మకంగా ఉన్నారు.
ఉప్పెన సినిమాతో దర్శకుడిగా మంచి మార్కులు దక్కించుకుని వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు బుచ్చిబాబు తన రెండో సినిమానే ఏకంగా మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్ తో చేసేందుకు సిద్ధం అయ్యారు. ఏడాది కాలంగా ఈ కాంబో మూవీ కోసం ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ బడ్జెట్‌ తో ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్‌ వారు భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నారు. బుచ్చిబాబు ఈ సినిమాను ఒక భారీ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందించబోతున్నారు. సినిమా షూటింగ్‌ ను అతి త్వరలోనే ప్రారంభించబోతున్నారు. నటీ నటుల ఎంపికతో పాటు, స్క్రిప్ట్‌ వర్క్‌, సెట్‌ వర్క్‌ దాదాపు పూర్తి అయింది. షూటింగ్‌ ప్రారంభం కావల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: