ఫ్యామిలీను మైమరపించడంలో వెంకీ-సౌందర్య కెమిస్ట్రీ వేరే లెవెల్.!

FARMANULLA SHAIK
* రియాలిటీకి దగ్గరలో వెంకీ-సౌందర్య కాంబో.!
* వెంకీ పక్కన సౌందర్యే అనేలా కెమిస్ట్రీ పండించిన జంట.!
* దాదాపు అన్నీ సినిమాలు హిట్లే.!
(టాలీవుడ్-ఇండియాహెరాల్డ్): చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరో, హీరోయిన్స్ ఉన్నప్పటికి అందులో కొంత మంది హీరో హీరోయిన్ కాంబినేషన్స్ ప్రేక్షకులను కట్టిపడెస్తాయి.ఇక అందులో కొంత మంది హీరో హీరోయిన్లు ఒకటి కంటే ఎక్కువ సినిమాల్లో కలిసి నటించిన వారిలో కొంత మంది హిట్ కాంబినేషన్స్ గా గుర్తింపు పొందారు. అలా హిట్ పెయిర్ గా గుర్తింపు పొందిన కాంబినేషన్స్ లో ఒక కాంబినేషన్ వెంకటేష్, సౌందర్య. వీరి జోడీకి చిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది వాళ్ళది ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ పెయిర్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అయితే ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్నారంటే సినిమా హిట్టే.వాళ్ళ కలయికలో వచ్చిన సినిమాల్లో పవిత్ర బంధం, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, పెళ్ళి చేసుకుందాం, రాజా, జయం మనదేరా, దేవిపుత్రుడు వంటి సినిమాలలో ఒక్క దేవీపుత్రుడు తప్ప మిగతావన్నీ బ్లాక్ బస్టర్సే అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు.అయితే చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరో, హీరోయిన్స్ ఉన్నారు. కానీ అందులో కొంత మంది హీరో హీరోయిన్ కాంబినేషన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇక అందులో కొంత మంది హీరో హీరోయిన్లు ఒకటి కంటే ఎక్కువ సినిమాల్లో కలిసి నటించారు. అలా నటించిన వారిలో కొంత మంది హిట్ కాంబినేషన్స్ గా గుర్తింపు పొందారు. అలా హిట్ పెయిర్ గా గుర్తింపు పొందిన కాంబినేషన్స్ లో ఒక కాంబినేషన్ విక్టరీ వెంకటేష్, సౌందర్య.  అందులో ముఖ్యంగా పెళ్లి చేసుకుందాం సినిమా చేయటం అనేది అప్పటికే తను టాప్ హీరోయిన్గా ఎదిగిన సౌందర్యకు ఒక పెద్ద సాహసం అనే చెప్పాలి. అందులో ఓ లైంగిక బాదితురాలి పాత్రలో నటించేందుకు ఒప్పుకోవడం పై చాలామంది ఆమెది రాంగ్ డెసిషన్ అని కూడా అన్నారు.ఇలాంటి పాత్రలు చేస్తే కెరీర్ సమస్యలో పడుతుందని హెచ్చరించారు. కానీ తను పాత్రను ప్రేమించింది. అలాగే అంతకు ముందే వెంకటేష్ తో చేసిన పవిత్రబంధంలో తన నటన ముందు వెంకటేష్ సైతం తేలిపోయాడంటే అతిశయోక్తి కాదు.
అయితే అలాంటి వారి మధ్య ఒకానొక టైమ్‌లో వీరికి గొడవలు తలెత్తాయని అంటుంటారు. దాని వల్లే ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ సినిమా చిత్రికరణ టైంలో మేకర్స్ బాగా ఇబ్బంది పడ్డారంట.అయితే ఆ సినిమా పూర్తి ఐనా తర్వాత ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అయితే ఆ గొడవ చాలా కాలం వీరిద్దరి మధ్య గ్యాప్ పెంచింది.వారి గొడవకు సంబంధించి ఇటు సౌందర్య దగ్గర గానీ, అటు వెంకీ దగ్గర గాని ప్రస్థావిస్తే నో కామెంట్ అని లైట్ తీసుకునేవారట.అప్పట్లో టాలీవుడ్ సావిత్రిగా అభివర్ణించేవారు సౌందర్యను. ఉన్నతమైన వ్యక్తిత్వం ఆమె సొంతం. హీరోయిన్‌గా కెరీర్ పీక్స్‌లో వున్న సమయంలోనే అర్ధాంతరంగా విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయి, యావత్ తెలుగు ప్రజానీకాన్ని శోక సంద్రంలో ముంచేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: