ఆ స్టార్ ప్రొడ్యుస‌ర్ ఇంట్లో టీవీ రిమోట్ ఎత్తుకొచ్చిన రాజ‌మౌళి...?

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి త్రిబుల్ ఆర్ లాంటి భారీ పాండ్ ఇండియా హిట్ సినిమా తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. ప్రస్తుతం రాజమౌళి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పాన్‌ వరల్డ్ సినిమా తెరకెక్కించే ప్రయత్నాల్లో బిజీ బిజీగా ఉన్నారు. దుర్గా ఆర్ బ్యాన‌ర్ పై సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం మహేష్ తన మేకవర్ మార్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈ సినిమా కోసం రాజమౌళి తండ్రి ప్రముఖ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ కథను సమకూర్చే ప్రయత్నంలో బిజీ బిజీగా ఉన్నారు. కథ‌ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయిన వెంటనే రాజమౌళి సినిమాలో నటించే నటీనటులు సాంకేతిక నిపుణుల‌ ఎంపిక పనిలో బిజీ బిజీ కానున్నారు.

ఇదిలా ఉంటే రాజ‌మౌళికి స్వ‌త‌హాగా మ‌తి మ‌రుపు బాగా ఎక్కువ అట‌. ఓ సారి ఏదో ప‌ని మీద నిర్మాత కేఎల్ .నారాయ‌ణ గారి ఇంటికి వెళ్లాడ‌ట‌. అలా రెండు గంట‌ల పాటు అక్క‌డే మాట్లాడార‌ట‌. త‌ర్వాత రాజ‌మౌళి టేబుల్ ముందు ఉన్న టీవీ రిమోట్ ను త‌న ఫోన్ అనుకుని మ‌ర్చిపోయి జేబులో పెట్టుకుని వ‌చ్చేశార‌ట‌. త‌ర్వాత ఇంటికి వ‌చ్చాక చూసుకుంటే ఫోన్ తో పాటు జేబులో మ‌రో వ‌స్తువు ఉందేంటా అని చూస్తే అది రిమోట్ అట‌. వెంట‌నే నిర్మాత నారాయ‌ణ‌కు ఫోన్ చేసి సార్ సారీ మీ టీవీ రిమోట్ తీసుకు వ‌చ్చాన‌ని చెప్ప‌డంతో పాటు పంపిస్తాన‌న్నార‌ట‌. రాజ‌మౌళితో నారాయ‌ణ రిమోట్ ఏం పంపిస్తావు.. నేను కొత్త‌ది కొనుక్కుంటానులే అని స‌ర‌దాగా అన్నార‌ట‌. ఈ విష‌యం రాజ‌మౌళి ఓ ఇంట‌ర్వ్యూ లో స్వ‌యంగా చెప్పారు. ఇక ప్ర‌స్తుతం రాజ‌మౌళి - మ‌హేష్ సినిమాకు కేఎల్ . నారాయ‌ణ నిర్మాత కావ‌డం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: