చరణ్.. పవన్ కోసం ఏకంగా అంత పెద్ద త్యాగం చేసిన చిరు.. మరి ప్రతిఫలం దక్కేనా..?

MADDIBOINA AJAY KUMAR
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. త్రిష ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తూ ఉండగా , వశిష్ట ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. యువి క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఇక కొన్ని రోజుల క్రితం ఈ మూవీ బృందం ఈ సినిమా టీజర్ ను విడుదల చేసింది.

ఇక ఈ టీజర్ ఈవెంట్లో భాగంగా విశ్వంభర మూవీ కి సంబంధించిన ఆల్మోస్ట్ పనులు కంప్లీట్ అయ్యాయి అని , జనవరి 10 కి ఈ సినిమాను విడుదల చేయాలి అంటే చేయొచ్చు కానీ రామ్ చరణ్ హీరోగా రూపొందిన గేమ్ చేంజెర్ సినిమాను సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయాలి అనుకుంటున్నారు. ఆ సినిమా కోసం విశ్వంభర మూవీ ని పోస్ట్ ఫోన్ చేస్తున్నాం అని మేకర్స్ ప్రకటించారు. ఇక విశ్వంభర మూవీ ని ఏకంగా మే 9 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇకపోతే గేమ్ చేంజర్ సినిమా కోసం మాత్రమే అయితే మరి విశ్వంభర మూవీ ని అంతకాలం పోస్ట్ ఫోన్ చేయాలా ..? ఆ తర్వాత నెలకో , రెండు నెలలలో విడుదల చేయొచ్చు కదా అనే అభిప్రాయాన్ని కొంత మంది వ్యక్తం చేస్తున్నారు.

ఇక మరి కొంత మంది మాత్రం చిరంజీవి కేవలం రామ్ చరణ్ కోసం మాత్రమే కాకుండా పవన్ కోసం కూడా ఆలోచించి విశ్వంభర మూవీ ని మే 9 వ తేదీన విడుదల చేయడానికి డిసైడ్ అయినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఎందుకు అంటే పవన్ హీరోగా రూపొందుతున్న హరిహర వీరమల్లు సినిమాను మార్చి 28 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ దగ్గరలో కూడా విశ్వంభర ఉండకూడదు అనే ఉద్దేశంతోనే చిరంజీవి "విశ్వంభర" మూవీ ని మే 9 వ తేదీకి షిఫ్ట్ చేసినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇలా చిరంజీవి ... చరణ్ , పవన్ ల కోసం పెద్ద త్యాగం చేశాడు అని కొంత మంది అభిప్రాయపడుతున్నారు. మరి చిరంజీవి త్యాగం ఫలించి విశ్వంభర మూవీ మంచి విజయం సాధిస్తుందో ... లేదో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: