టాలీవుడ్: బాధను మరిపించేది సినిమా.. బాధ పెట్టేది కాదు..?

Pandrala Sravanthi
- కంటెంట్ తక్కువ..ప్రచారం ఎక్కువ..
- పేదోడి సినిమాలు జాడేలేవు.?
- సినిమా చూడాలంటే ఆస్తులు అమ్మాల్సిందేనా.?

 సాధారణంగా సినీ హీరోలకు విపరీతమైనటువంటి అభిమానులు ఉంటారు.  వారి అభిమాన హీరో సినిమా వస్తుంది అంటే ఎప్పటినుంచో చూడాలి చూడాలి అంటూ ఎదురు చూస్తారు. అలా అభిమాన హీరో సినిమా  చూడాలనుకున్నటు వంటి ఫ్యాన్స్  కూడా చివరికి టికెట్లు రేట్ల వల్ల చూడలేకపోతున్నారట. ఇక అభిమానుల పరిస్థితి అలా ఉంటే సాధారణ జనాల పరిస్థితి ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఏదైనా వీకెండ్లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి సినిమా చూడాలి అనుకుంటే మాత్రం జేబు గుల్లా చేసుకోవాల్సిందే. హీరో రేంజ్ ను బట్టి సినిమా టికెట్ల రేట్లు 3000 నుంచి 5000 వరకు పలుకుతున్నాయి. ఇక ఫ్యామిలీ సినిమాకు వెళ్లాలంటే తప్పనిసరిగా  పదివేలకు పైగానే ఖర్చు పెట్టాల్సిందే. సినిమాకు వెళ్లి ఆనందపడాలా చివరికి ఖర్చు అయ్యాయని కొన్ని రోజులపాటు ఏడవాల అనే దుస్థితిలో ఉన్నారు సాధారణ ప్రజలు. అలా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పనిచేసే హీరో హీరోయిన్లు దర్శక నిర్మాతలు  వారు తీసుకునే రెమ్యూనరేషన్లు పెంచుకుంటూ, ఆ భారాన్ని పేద ప్రజలపై వేస్తున్నారని  అంటున్నారు.

 ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ  వంటి హీరోలకు ఎంతో మంది అభిమానులు ఉండేవారు. అంత పెద్ద స్టార్డం సంపాదించిన వారే, సినిమా ఇండస్ట్రీ పరిస్థితిని చూసి రెమ్యూనరేషన్ తీసుకునేవారు. కానీ ప్రస్తుత కాలంలో ఒక్క పాన్ ఇండియా హిట్ అయితే చాలు ఏకంగా  50 కోట్ల నుంచి 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ పెంచి, సినిమా బడ్జెట్ ను 300 నుంచి 500 కోట్ల వరకు పెట్టి, దానికి డబల్ రేట్లు టికెట్లు పెంచి, ఆ భారాన్ని పేద ప్రజలపై వేస్తూ చివరికి సినీ దర్శక నిర్మాతలు సొమ్ము చేసుకుంటున్నారని సీనియర్ సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇది ఇలాగే కొనసాగితే మాత్రం పేదవాడికి సినిమా అంటే  ఏ ఓటిటియో లేదంటే  ఐ బొమ్మనో దిక్కవుతుంది తప్ప థియేటర్ లకు వెళ్లే పరిస్థితి దూరమవుతుందని చెప్పవచ్చు. దీనిపై సినీ ఇండస్ట్రీ వారు ఆలోచన చేస్తారా లేదంటే మాకెందుకులే అని అలాగే ముందుకు వెళ్తారా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: