అల్లు అర్జున్‌ను కావాల‌నే టార్గెట్ చేస్తున్నారు.. టాలీవుడ్ నిర్మాత సంచ‌ల‌నం..?

RAMAKRISHNA S.S.
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఎలాంటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అల్లు అర్జున్ నటించిన సినిమాలకు మాస్ .. క్లాస్ అన్న తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తూ ఉంటుంది. ఇక పుష్ప సినిమాతో బన్నీ ఇమేజ్ దేశ వ్యాప్తంగా అమాంతం అలా పెరిగిపోయింది. దర్శకుడు సుకుమార్ తెర‌కెక్కించిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర తిరుగులేని సెన్షేష‌న్ క్రియేట్ చేసింది. ఇప్పుడు పుష్ప సినిమాకు సీక్వెల్ గా వస్తున్న పుష్ప‌ పార్ట్ టూ పై దేశవ్యాప్తంగా ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

అయితే ఇటీవల బన్నీపై సోషల్ మీడియాలో బాగా నెగిటివిటీ ఎక్కువగా జరుగుతుంది. దీనిపై బన్నీకు అత్యంత సన్నిహితుడు ఆయన నిర్మాత ఎస్కేఎన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. బన్నీపై కొందరు కావాలనే టార్గెట్ చేస్తూ నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారని అన్నారు. ఓ సినిమా ఫంక్షన్లో ఆయన అల్లు అర్జున్ పై కొన్ని కామెంట్లు చేశారు. ఎలాంటి ప్ర‌మోషన్లు లేకుండా నార్త్ ఇండియాలో రిలీజ్ అయ్యి ఏకంగా రు. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిందని తెలిపారు. ఈ సినిమాకు అక్కడ ఆ టైంలో అలాంటి రీచ్ వచ్చిందంటే ఏ స్థాయిలో ప్రేక్షకులను మెప్పించిందో అర్థం చేసుకోవచ్చన్నారు.

కలకత్తాలోని ఓ మావోయిస్ట్ ప్రాంతంలో సినిమాలు రిలీజ్ చేయ‌డం చాలా చాలా కష్టం.. కానీ, అక్కడ ‘పుష్ప’ మూవీ ఏకంగా 50 రోజులు రన్ అయ్యింది. ఇది అల్లు అర్జున్, పుష్ప కి ఉన్న రీచ్ అని ఆయన అన్నారు. ఇక తెలుగు సినిమా చరిత్రలో 70 ఏళ్లుగా ఎవరూ సాధించలేని జాతీయ ఉత్తమ నటుడి అవార్డును కేవలం అల్లు అర్జున్ మాత్రమే సాధించడం ఆయన సత్తాను తెలుపుతుందని ఎస్‌కెఎన్ బ‌న్నీకి తిరుగు లేకుండా ఇచ్చిన ఎలివేష‌న్లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: