రష్మిక మందన్నాకు ఏమైంది..? సడన్ గా ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకుంది..?

Thota Jaya Madhuri
రష్మిక మందన్నా.. నేషనల్ క్రష్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ . కన్నడ బ్యూటీనే అయినప్పటికీ తెలుగులో బాగా బాగా క్రేజ్ సంపాదించుకుంది.  ఎంతలా అంటే ఒక్కొక్క సినిమాకి 6 నుంచి 7 కోట్లు డిమాండ్ చేసే స్థాయికి ఎదిగిపోయింది . నిజానికి రష్మిక మందన్నా అంత క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకోవడానికి కారణం ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడమే. చాలామంది హీరోయిన్స్ సినిమాలో బిజీ షెడ్యూల్లో పడిపోయి ఫ్యాన్స్ ని మర్చిపోతూ ఉంటారు . వాళ్లతో చిట్ చాట్ చేయరు. వాళ్లతో లైవ్ ఇంటరాక్షన్స్ పెట్టుకోరు.

\
అయితే రష్మిక మందన్నా మాత్రం ఆ విషయంలో డిఫరెంట్ . మొదటి నుంచి రష్మిక మందన్నా ఫ్యాన్స్ తో బాగా మాట్లాడుతుంది. 10 నిమిషాలు ఖాళీ టైం దొరికిన సరే ఇంస్టాగ్రామ్ ద్వారా లైవ్ కి వచ్చి అభిమానులతో చిట్ చాట్ చేస్తూ అభిమానుల డౌట్ లకి క్లారిటీ  ఇస్తూ ఉంటుంది . అలాంటి రష్మిక మందన ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో దూరంగా ఉంది . రీసెంట్ గా ఒక్క ఫోటో షేర్ చేసింది అంతే. నిజానికి రష్మిక మందన్నా అంటే అది కాదు..అంతకు మించి యాక్టీవ్ గా ఉంటుంది. ఎందుకు రష్మిక సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్గా ఉండడం లేదు . ఇక్కడే అసలు సమస్య అంతా వచ్చి చేరింది .



రష్మిక మందన్నా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది . ఎంత బిజీగా ఉన్నా సరే కనీసం వారానికి ఒక్కసారి అయినా అభిమానులతో మాట్లాడుతుంది.  అలాంటి రష్మిక ఎందుకు సడన్గా సోషల్ మీడియాకి దూరమైంది ..? కొంపతీసి  ఆమెకు ఏమన్నా హెల్త్ ఇష్యూ వచ్చిందా..? లేకపోతే సినిమా షూట్ లో బిజీగా ఉండి టైం స్పెండ్ చేయలేకపోతుందా? అన్న విధంగా ఆలోచిస్తున్నారు . రష్మిక డైహార్ట్ ఫ్యాన్స్ అయితే రకరకాలుగా మాట్లాడేసుకుంటున్నారు.  రష్మిక రెస్పాండ్ అవ్వాలి అని రష్మిక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడమే తమకు ఎనర్జీ ఇస్తుంది అని చెప్పుకొస్తున్నారు. అసలు రష్మిక సోషల్ మీడియాకి ఎందుకు దూరమైంది..? ఎందుకు యాక్టివ్గా లేదు..? అనేది ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారిపోయింది . ఏమో దీనిపై రష్మిక స్పందిస్తేనే బాగుంటుంది అంటున్నారు ఫ్యాన్స్..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: