ఆ మూవీలో ఎన్టీఆర్ లుక్ విషయంలో ఎన్నో నెగటివ్ కామెంట్స్.. అసలు ఎందుకలా..?

MADDIBOINA AJAY KUMAR
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కాజల్ అగర్వాల్ , సమంత హీరోయిన్లుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కొన్ని సంవత్సరాల క్రితం బృందావనం అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించాడు. ఇకపోతే ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా స్టార్ట్ కావడానికి ముందు జరిగిన కొన్ని ఇంట్రెస్టింగ్ పరిణామాల గురించి తాజా ఇంటర్వ్యూలో భాగంగా ఈ సినిమా నిర్మాత అయినటువంటి దిల్ రాజు చెప్పుకొచ్చాడు.

దిల్ రాజు తాజా ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ... వంశీ పైడిపల్లి "మున్నా" సినిమా ఫెయిల్ కావడంతో కాస్త డిసప్పాయింట్ అయ్యాడు. దానితో నేను ఆయనతో నువ్వు సినిమా బాగానే చేశావు. కథ లోనే లోపం ఉంది. కథ ముందు సెట్ చేసుకో ... మళ్లీ వేరే సినిమా చేద్దాం అన్నాను. దానితో ఆయన కొంత మంది రైటర్స్ తో కలిసి బృందావనం స్టోరీని తయారు చేశాడు. ఆ కథ నాకు అద్భుతంగా అనిపించింది. వెంటనే జూనియర్ ఎన్టీఆర్ ను పిలిపించి ఆయనకు కథను వినిపించాను. ఆయనకు కూడా కదా ఆ స్టోరీ అద్భుతంగా నచ్చింది. వెంటనే సినిమా చేద్దాం అన్నాడు. ఇక ఆ తర్వాత బృందావనం సినిమా కంటే ముందు ఎన్టీఆర్ వరుస పెట్టి మాస్ సినిమాలలో నటించడం వల్ల మాస్ లుక్ లో కంటిన్యూ అవుతూ వచ్చాడు.

ఇక బృందావనం ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో ఎన్టీఆర్ ను లుక్ ను మారుద్దాం అనుకున్నాం. దానితో మీసాలు తీసేసి , చెవికి పోగు పెట్టాం. దానితో కొంత మంది జూనియర్ ఎన్టీఆర్ మీసాలు తీసేసి చెవి పోగు పెడితే బాగా లేడు అన్నారు. దానితో మేము మొదట అలానే అనిపిస్తుంది. ఆ తర్వాత నచ్చుతుంది అనుకున్నాం. అలాగే ఆ తర్వాత ఆ లుక్ చాలా మంది కి నచ్చింది. సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయింది అని దిల్ రాజు తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: