రహస్యంగా కేరళ వెళ్లిన టాలీవుడ్‌ హీరోలు... ?

Veldandi Saikiran
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కొన్ని దశాబ్దాల కాలం నుంచి అగ్ర కథానాయకులుగా కొనసాగుతున్న వారిలో మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున ముందు వరసలో ఉంటారు. వీరిద్దరికీ సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది అభిమానులు, అభిమాన సంఘాలు కూడా ఉన్నాయి. వీరి సినిమాలో వచ్చాయంటే జనాలు ఎగబడి చూస్తారు. సినీ ఇండస్ట్రీలో వీరికి అంటూ ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక చిరంజీవి, నాగార్జున కుటుంబాల మధ్య చాలా మంచి సాన్నిహిత్యం ఉంటుంది.

ప్రతి ఫంక్షన్ లో వీరు కలుసుకుంటూ ఉంటారు. సినిమాల పరంగానే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా వీరిద్దరూ ఎంతో స్నేహంగా, అన్యోన్యంగా కలిసి ఉంటారు. అంతేకాకుండా కలిసి వ్యాపారాలు చేస్తారని అనేక రకాల వార్తలు వచ్చాయి. కానీ వాటిలో ఎంతవరకు నిజముంది అనేది తెలియదు. అన్ని సందర్భాల్లోనూ ఇద్దరూ ఒకరికొకరు తోడుగా ఉంటారు. ఇటీవలే తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వాక్యాలపై చిరంజీవి తీవ్రస్థాయిలో ఖండించడమే కాకుండా ఆగ్రహం వ్యక్తం చేశారు.

అటువంటి కథనాయకులిద్దరు కలిసి ప్రత్యేకంగా విమానంలో కేరళ వెళ్లారు. కేరళలోని త్రిసూరులో కళ్యాణ్ జువెలర్స్ యజమానికి టీఎస్ కల్యాణరామన్ ఇల్లు ఉంది. దసరా వేడుకలు వారి ఇంట్లో వైభవంగా జరిగాయి. కళ్యాణ రామన్ దసరా వేడుకలు బాగా చేస్తామని, మీరిద్దరూ మా ఇంటికి వచ్చి పాల్గొనాలని చిరంజీవి, నాగార్జునకు ఆహ్వానం పంపారు.

కళ్యాణ్ జువెలర్స్ కు నాగార్జున బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఇందులో నాగార్జునకు కూడా వాటాలు ఉన్నాయని అనేక రకాల వార్తలు వస్తున్నాయి. ఇక వారి ఆహ్వానం మేరకు దసరా వేడుకల్లో పాల్గొనడానికి ఈ ఇద్దరు స్టార్ హీరోలు ప్రత్యేక విమానంలో కలిసి త్రిసూర్ వెళ్లారు. కళ్యాణరామన్ ఇంట్లో దసరా వేడుకల్లో పాల్గొనడంతో పాటు వారి కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ఫోటోలు కూడా దిగారు. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: