'BB4 : అఖండ' తాండవం.. టైటిల్ తోనే హైప్ పెంచేసిన బాలయ్య?

praveen
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంత మంది హీరోలు ఉన్నా.. అటు బాలకృష్ణకు మాత్రం ప్రత్యేకమైన క్రేజ్. మరీ ముఖ్యంగా మాస్ ప్రేక్షకులకు బాలయ్య దేవుడిగా కొనసాగుతూ ఉంటాడు. బాలయ్య డైలాగ్ చెబుతున్నాడు అంటే చాలు మాస్ ప్రేక్షకులందరీ విజిల్స్ తో థియేటర్ దద్దరిల్లిపోతు ఉంటుంది అని చెప్పాలి. ఇక ఆయన సినిమాల్లోని యాక్షన్స్ సన్నివేశాలు  ప్రేక్షకులు అందరికీ కూడా పూనకాలు తెప్పిస్తూ ఉంటాయి. అయితే గతంలో బాలయ్య వరుస డిజాస్టర్ లతో తెగ ఇబ్బంది పడిపోయాడు. కానీ ఇక బాలయ్యకు వరుసగా సూపర్ హిట్టు ఇచ్చింది మాత్రం ఒకే ఒక్క దర్శకుడు.

 అతనే బోయపాటి శ్రీను. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహా సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. బాలయ్యను ఎలా అయితే అభిమానులు చూడాలని కోరుకున్నారో.. అలాగే చూపించి సూపర్ సక్సెస్ అందుకున్నాడు బోయపాటి. ఆ తర్వాత వీరి కకాంబోలో వచ్చిన రెండో మూవీ లెజెండ్ కూడా ఇలాగే హిట్ అయింది. ఇక ముచ్చటగా మూడోసారి అఖండ సినిమా వచ్చి సెన్సేషన్ విజయాన్ని సాధించింది. ఇక ఇప్పుడు నాలుగోసారి కూడా ఈ హిట్ కాంబో రిపీట్ అవుతుంది అన్న విషయం తెలిసిందే. దీంతో ఇక ఈ మూవీపై అంచనాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అఖండ మూవీకి సీక్వల్ గా తెరకే క్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తుందేమో అని అభిమానులు కూడా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

 అయితే అఖండ - తాండవం టైటిల్ తో రాబోతున్న ఈ మూవీకి సంబంధించి పోస్టర్ను ఇటీవల చిత్ర బృందం విడుదల చేశారు. పోస్టర్ లో ఆధ్యాత్మికతను జోడిస్తూ శివలింగం రుద్రాక్షలు హిమాలయాలు వంటి పలు అంశాలను చూపించారు. బాలకృష్ణ హీరోఇజాన్ని ఎలివేట్ చేయడంలో ఎప్పుడూ బోయపాటి ముందుంటారు. అయితే ఇప్పుడు అఖండ రెండో పార్ట్ పూర్తిగా అఘోర పాత్ర చుట్టే తిరుగుతుంది అని ఈ పోస్టర్ చూసిన తర్వాత  ప్రేక్షకులు అనుకుంటున్నారు.


 అయితే బాలకృష్ణ కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెలకెక్కుతూ ఉండటం గమనార్హం. 14 రీల్స్ పతాకం పై నిర్మిస్తున్నారు. అయితే డైరెక్టర్ బోయపాటికి అటు హీరో బాలకృష్ణకు కూడా కెరియర్ లో ఇదే మొదటి పాన్ ఇండియా మూవీ. ఈ సినిమాను కేవలం తెలుగులోనే కాదు వివిధ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరి ఇప్పటికే టాలీవుడ్ లో తన సత్తా ఏంటో నిరూపించిన బాలయ్య.. ఇక ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో ఎలా సత్తా చాటుతాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: