బాల‌య్య ఫ‌ట్ - చిరంజీవి యావ‌రేజ్ - వెంకీ బ్లాక్‌బ‌స్ట‌ర్‌... ఈ స్టోరీ తెలుసా..?

Amruth kumar
( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .
టాలీవుడ్ లో ప్రతి సంక్రాంతికి పెద్ద పెద్ద సినిమాలు భారీ అంచనాలు ఉన్న సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి .. కొన్ని సందర్భాలలో చిన్న సినిమాలు కూడా సంక్రాంతికి రిలీజ్ అయ్యి పెద్ద సినిమాల పోటీని తట్టుకుని విజయం సాధించిన సందర్భాలు కూడా ఉన్నాయి . ఈ క్రమంలోనే 20 ఏళ్ల క్రితం 2000 సంవత్సరం సంక్రాంతికి టాలీవుడ్ లో ఏకంగా ముగ్గురు స్టార్ హీరోలు బాక్సాఫీస్ దగ్గర పోటీపడ్డారు .. నందమూరి నటసింహం బాలకృష్ణ , నటించిన వంశోద్ధారకుడు , మెగాస్టార్ చిరంజీవి నటించిన అన్నయ్య , విక్టరీ వెంకటేష్ నటించిన కలిసుందాం రా.. సినిమాలో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి ..

ఇక ఈ ముగ్గురు స్టార్ హీరోలుగా ఉండడంతో సంక్రాంతి రేసులో ఎవరు విజయం సాధిస్తారు.. అన్నది సహజంగానే అంద‌రిలో ఆసక్తి ఉంటుంది. శరత్ దర్శకత్వంలో బాలయ్య చేసిన వంశోద్ధారకుడు సినిమాలో రమ్యకృష్ణ , సాక్షి శివానంద్ హీరోయిన్గా నటించారు .. ఈ సినిమా ప్రేక్షకులకు ఎక్కలేదు బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచింది. అటు మెగాస్టార్ చిరంజీవి హీరోగా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో అన్నయ్య సినిమా తెరకెక్కింది .. సౌందర్య ఈ సినిమాలో హీరోయిన్ అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన అన్నయ్య హిట్ సినిమాగా నిలిచింది.

ఇక తమిళ రీమిక్‌ సినిమాకు అనుబంధంగా తెరకెక్కిన కలిసుందాం రా సినిమాకు ఉదయ్‌ శంకర్ దర్శకుడు వెంకటేష్ కు జోడిగా సిమ్రాన్ హీరోయిన్‌గా నటించింది.. కంప్లీట్ ఫ్యామిలీ స్టోరీగా కుటుంబ అనుబంధాల నేపథ్యంలో తెరకెక్కిన కలిసుందాం రా టాలీవుడ్ బాక్సాఫీస్ ను దున్నేసింది.. చాలా కేంద్రాలలో 175 రోజులు కొన్ని చోట్ల 200 రోజులు మరికొన్నిచోట్ల 250 రోజులు కూడా కలిసుందాం రా ఆడింది .. అలా 2000 సంక్రాంతి బాక్స్ ఆఫీస్ విన్నార్‌గా విక్టరీ వెంకటేష్ విజేతగా నిలిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: