ఏడుపు అంటే నాకు చాలా ఇష్టం.. గ్లామర్ కోసం కన్నీరు పెట్టుకుంటున్న స్టార్ హీరోయిన్..!

Amruth kumar
చిత్ర పరిశ్రమలో హీరోయిన్లు అందంగా కనిపించడం కోసం.. వారు ఏవేవో చేస్తూ ఉంటారు.. తమ అందాన్ని కాపాడుకోవడం కోసం ఎన్నో రకాల క్రీమ్స్, సబ్బులు, సిరప్స్ లాంటివి వారు వాడుతారు.. మరికొంతమంది అందం కోసం కొన్ని లక్షల ఖర్చు చేస్తూ ఉంటారు. అలాగే సర్జరీలు కూడా చేయించుకోవడానికి వెనకాడరు. అయితే ఓ ముద్దుగుమ్మ మాత్రం డిఫరెంట్ అందం కోసం ఏడుస్తుందంట. అంతేకాదు తాను ఏడుస్తేనే ఎక్కువగా అందంగా ఉంటానని కూడా అంటుంది. ఈ విషయం వినగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. మన పెద్దలు కూడా ఏడిస్తే కొందరు అందంగా ఉంటారని అంటారు.. కానీ ఈ హీరోయిన్ మాత్రం అందం కోసం ఏడుస్తా అని చెపుతుంది. ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరు? అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

ఇక ఈ ముద్దుగుమ్మ పాన్ ఇండియా లెవెల్ లో నటించి ప్రత్యేక అభిమానులను క్రియేట్ చేసుకుంది. ఇంతకీ ఈమె ఎవరంటే టాలీవుడ్ లో ఈమె నటించింది ఒకే ఒక సినిమా కానీ అది డిజాస్టర్ అయింది. కానీ తన అందంతో యువతను కట్టుప‌డేస్తుంది.. ఇంత‌కి ఆమె మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనన్య పాండే ..ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ లో వ‌రుస‌ సినిమాలతో బిజీగా ఉంది. ఇదే క్రమంలో ఈమె తెలుగులో విజయ్ దేవరకొండకు జంటగా లైగార్‌ సినిమాలో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ డిజాస్టర్ గా మిగిలిపోయింది.

ఆ తర్వాత మళ్లీ అనన్య టాలీవుడ్ లో కనిపించలేదు. బాలీవుడ్ పైనే ఈ అమ్మడు ఎక్కువ ఫోకస్ పెట్టింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ తన గ్లామర్ సీక్రెట్ ను బయటపెట్టింది. తన అందానికి కారణం ఏడుపు అని చెప్పింది ఈ భామ. తాజాగా అనన్య మాట్లాడుతూ.. తనకు ఏడుపు అంటే చాలా ఇష్టం అని తెలిపింది. కన్నీళ్లతో నిండిన కళ్ళు తనకు నేచురల్ అందాన్ని, తన ముఖంలో మెరుపుని ఇస్తాయి అని చెప్పుకొచ్చింది. మాములుగా కంటే ఏడుస్తున్న అప్పుడు ఇంకా ఎక్కువ అందంగా ఉంటాను. చాలాసార్లు ఏడుస్తూ అద్దంలో చూసుకున్నాను. నేను నా ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేను. నాకు ఆటోమేటిగ్గా కన్నీళ్లు వస్తాయి. ఆ కన్నీళ్లు నా అందాన్ని మరింత పెంచుతాయి. అప్పుడప్పుడు నా సోషల్ మీడియాలో నేను ఏడ్చే ఫొటోలు కూడా పెడతాను అని చెప్పుకొచ్చింది అనన్య పాండే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: