ఎన్టీఆర్ సినిమాలో చిరంజీవిని నటించకుండా షాక్ ఇచ్చింది ఎవరు .. అసలు ఆ సినిమా విషయంలో జరిగింది ఇదే..!

Amruth kumar
నటరత్న ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే .. తన నటన తో ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్న ఎన్టీఆర్ .. ముఖ్యంగా పౌరాణిక పాత్రలు చేసి అందర్నీ ఆకట్టుకునేవారు . 1981 అక్టోబర్ 7న‌ విడుదలైన కొండవిటి సింహం సినిమాలో ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ గా ఎన్టీఆర్ నటన అందరికీ ఎంతో ఇష్టం అప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న రికార్డ్ లు  అన్నిటిని కూడా చెత్త బుట్టలో పడేసి కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. అసలు ఆ రోజుల్లో ప్రతి తెలుగు వాడి నోటి నుంచి ఈ సినిమాలో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ లు వచ్చేవి అంతటి గొప్ప సినిమా కొండవీటి సింహం.

అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వార్త‌ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ సినిమాలో తండ్రీ కొడుకుల పాత్రలో నటించారు. అలాగే సినిమాలో ఎన్టీఆర్ కు చిన్న కొడుకుగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే ఎన్టీఆర్ ఇన్స్పెక్టర్ రంజిత్ గా , రాము డ్యూయల్ రోల్‌లో కనిపిస్తారు. అలాగే రంజిత్ కుమార్ కి ఒక కొడుకు పుట్టగానే కొడుకు ఉంటే రంజిత్ కుమార్ కి ప్రమాదం అనీ జ్యోతిష్యుడు చెప్పడంతో రంజిత్ కుమార్ మావయ్య ఆ బిడ్డని దూరం చేస్తాడు.

ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి ఇంకో కొడుకు పుట్టి చెడ్డవాడుగా మారతారు .. అయితే ఈ క్యారెక్టర్ కి దర్శకుడు రాఘవేంద్రరావు ముందుగా చిరంజీవిని తీసుకోవాలని నిర్మాతలకు చెప్పారట.. వాళ్లు కూడా ఓకేే అన్నారు. అయితే ఆ స‌మ‌యంలో చిరంజీవి డేట్స్ లేకపోవడంతో ఆ క్యారెక్టర్ కి మోహన్ బాబుని తీసుకున్నారు. ఇదే విషయం స్వయంగా రాఘవేంద్రరావు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పక వచ్చారు. ఈ సినిమాలు ఎన్టీఆర్ స‌ర‌స‌న జయంతి, చిన్న ఎన్టీఆర్ కు జంటగా శ్రీదేవి , మోహన్ బాబుకు జంటగా గీత నటించారు. అలా ఎన్టీఆర్‌కు కొడుకుగా నటించాల్సిన చిరంజీవి డేట్స్ కుదరకపోవడం వల్ల సినిమా నుంచి తప్పుకున్నారని వార్త ప్రస్తుతం వైర‌ల్‌గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: