కార్నర్ అవు క !

Seetha Sailaja

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం డిఫరెంట్ సినిమాలలో నటిస్తూ తన ఇమేజ్ ని పెంచు కోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే ఇప్పటివరకు ఈ యంగ్ హీరో చేసిన ప్రయత్నాలు చెప్పుకోతగ్గ స్థాయిలో ఫలితాన్ని ఇవ్వకపోవడంతో అతడి కెరియర్ అంతంతమాత్రంగానే నడుస్తోంది. అయినప్పటికీ అతడు పట్టువదలకుండా తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.

ఇలాంటి పరిస్తితుల మధ్య ఇతడు నటించిన ‘క’ మూవీ దీపావళి’ కి విడుదలకావడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. వాస్తవానికి ఈసారి ‘దీపావళి’ కి మంచి అంచనాలు ఉన్న సినిమాలు చాల విడుదల అవుతున్నాయి. అయితే ఇంత పోటీ ఉన్న ఆవిషయాన్ని పట్టించుకోకుండా కిరణ్ అబ్బవరం తన ‘క’ తో చేస్తున్న సాహసం చాలామందిని ఆశ్చర్య పరుస్తున్నాయి.

రాబోతున్న ‘దీపావళి’ కి దుల్కర్ సల్మాన్ నటించిన డైరెక్ట్ తెలుగు మూవీ లక్కీ భాస్కర్ విడుదల కాబోతోంది. ప్రస్తుతం యూత్ లో బాగా క్రేజ్ ఉన్న మీనాక్షి చౌదరి ఈమూవీ హీరోయిన్ గా నటించింది. ఈనెల 21 గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్ జరిగాక ఈమూవీ పై మరిన్ని భారీ అంచనాలు పెరుగుతాయి అని అంటున్నారు. ఈమూవీతో పాటు సత్య దేవ్ నటించిన  ‘జీబ్రా’ విడుదలకాబోతోంది. ఈమూవీ చాల డిఫరెంట్ కథ అని అంటున్నారు.

ఈమూవీలతో పాటు శివ కార్తికేయన్ సాయిపల్లవి నటించిన ‘అమరన్’ కూడ విడుదల కాబోతోంది. భారీ అంచనాలు ఉన్న అనేక బాలీవుడ్ మూవీలు కూడ ఈ దీపావళి రేస్ లో పోటీ పడుతున్నాయి. అంతేకాదు ప్రశాంత్ నీల్ కథను అందించిన ‘బఘీరా’ మూవీ హీరో నటించిన మూవీ కూడ ఈ దీపావళి రేస్ లో ఉంది.  ఇంత పోటీ మధ్య ‘క’ ఎంతవరకు సక్సస్ అవుతుంది అన్న సందేహాలు కొందరిలో ఉన్నాయి. ఈమూవీలో పోస్ట్ మేన్ గా కనిపించబోతున్న కిరణ్ అబ్బవరం ఈమూవీని స్వయంగా నిర్మిస్తూ పాన్ ఇండియా మవ్వగా విడుదల చేయడం మరింత షాకింగ్ గా మారింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: