BB-4: ఆ హీరోయిన్ కెరియర్ మొత్తం బాలయ్య మీదే..?

Divya
టాలీవుడ్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ ఈమె కెరియర్లో ఒక సినిమా హిట్ అయింది అంటే చాలు ఎన్నో ఫ్లాపులు చుట్టుముడుతూ ఉంటాయి.. అందం, అభినయం ఉన్నప్పటికీ ఎందుకో ఈ ముద్దుగుమ్మకు సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోతోంది. కోలీవుడ్లో మొదటిసారిగా వీరట్టు అనే సినిమా ద్వారా తన కెరీర్ ని మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది. తెలుగులో మిర్చి కుర్రాడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈమె 2015 లో వచ్చిన కంచే చిత్రంతో భారీ క్రేజ్ అందుకున్నది. ఈ సినిమాకి అవార్డు కూడా అందుకున్నది.

ఇక తర్వాత వరుసగా అవకాశాలు వచ్చిన.. నక్షత్రం, గుంటూరోడు, జయజానకి నాయక తదితర చిత్రాలలో నటించిన అనుకున్నంత స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. మళ్లీ 2021లో బాలయ్యతో అఖండ సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత మళ్లీ ఇతర చిత్రాలు నటించిన పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. దీంతో సోషల్ మీడియాలో తన గ్లామర్ తో ఉర్రూతలు ఊగించిన ప్రగ్యా జైస్వాల్  మళ్లీ ఇప్పుడు బాలయ్య బోయపాటి కాంబినేషన్లో వస్తున్న అఖండ-2 సినిమాలో నటించబోతోంది.
2021 లో వచ్చిన అఖండ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు అదే ముహూర్తానికి ఈ సినిమా సీక్వెల్లి ప్రకటించారు చిత్ర బృందం అఖండ-2 తాండవం పూజ కార్యక్రమాలు ఈ రోజున చేయడం జరిగింది ఇందులో ప్రగ్యా జైస్వాల్ , బాలయ్య నిలబడి ఉండగా బాలయ్య కుమార్తె తేజస్విని క్లాప్ కొట్టి మరి చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమాలను పూర్తి చేశారు. దీంతో ఇప్పుడు మరొకసారి ప్రగ్యా ఆభిమానులు  కచ్చితంగా బాలయ్య ప్రగ్య ఫ్లాపుల్లో ఉన్నప్పుడు అఖండతో భారీ విజయాన్ని అందించారు.. ఇప్పుడు మళ్లీ  అఖండ-2 తో సక్సెస్ ఇస్తారనే నమ్మకంతో ఉన్నారు. మరి అభిమానులు అనుకున్నట్టుగానే ఈ హీరోయిన్ కెరియర్ మొత్తం కూడా బాలయ్య అఖండ-2 సక్సెస్ మీదే ఆధారపడి మరి ప్రగ్యా కెరీర్ ని బాలయ్య మారుస్తాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: