స్టోరీను కాకుండా హీరోల వ్యాల్యూని నమ్ముకున్న డైరెక్టర్.. అక్కడే బెడిసి కొట్టిందా..?

Divya
•మహేష్ ను అనుకున్న పాత్రకు చరణ్ ను ఫిక్స్ చేయడం..
•చరణ్ పాత్ర కోసం కాజల్ ను కట్ చేయడం..
•స్టోరీని కాకుండా హీరోల వ్యాల్యూ ని నమ్మడం..

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఫ్లాప్ ఎరుగని డైరెక్టర్లలో డైరెక్టర్ కొరటాల శివ కూడా ఉండేవారు. కానీ చిరంజీవి,  రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన ఆచార్య సినిమా ఘోరమైన డిజాస్టర్ ని మూట కట్టుకోవడంతో ఈయన మీద చాలామంది ట్రోల్ చేశారు. అయితే ఈ సినిమా మెగా అభిమానుల నుంచి కూడా నిలదొక్కుకోలేకపోయింది. చాలామంది ఈ సినిమా చూసిన వారందరూ కూడా తిట్టుకోవడం గమనార్హం. ఆచార్య సినిమా ఫ్లాప్ కావడానికి గల కారణాలను ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం.

ఆచార్య సినిమాలో చిరంజీవి ఎంట్రీ బాగానే ఇచ్చినా.. ఇందులోని సింపుల్ ఎంట్రీ అభిమానులకు నచ్చలేదట. ఇందులోని ఫైటింగ్ సన్నివేశాలు కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఇద్దరు స్టార్ హీరోలను ఒకేసారి కొరటాల శివ మెయింటైన్ చేయలేకపోయారు అనే వార్తలు కూడా వినిపించాయి. అలాగే కాజల్ అగర్వాల్ ని కూడా సినిమా నుంచీ తీసివేయడం కూడా సినిమా నెగిటివిటీకి కారణమయ్యింది.  వెన్నెల కిషోర్ వంటి కమెడియన్స్ ఉన్నా కూడా ఇందులో కామెడీ డైలాగులు పంచ్ డైలాగులు వంటివి ఉపయోగించుకోలేకపోయారు.

ఇందులో బిజిఎం రొటీన్ గానే ఉండిపోయింది. అలాగే ఇందులో పూజా హెగ్డే గ్లామర్ ని చూపించినంతగా స్టోరీలో పస లేకపోయిందనే విధంగా వార్తలు వినిపించాయి. చిరంజీవి, రామ్ చరణ్ ను ఒకే స్క్రీన్ మీద చూపించడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యారని కామెంట్స్ కూడా వినిపించాయి. ఆచార్య సినిమా మొదటి ప్రీమియం షోలతోనే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ఆచార్య సినిమాలో  డైరెక్టర్.. స్టోరీ కంటే స్టార్ హీరోల వ్యాల్యూ ని నమ్ముకోవడం మైనస్ గా మారింది. కానీ కొరటాల శివ ఒక ఇంటర్వ్యూలో మాత్రం ఈ సినిమా స్టోరీ రాసుకున్న తర్వాత చిరంజీవికి వినిపించగా..  అందులో చాలా మార్పులు చేయడం వల్ల ఈ సినిమా ఫ్లాప్ అయ్యిందని కూడా తెలిపారు. అయితే ఇందులో ఒక ప్రత్యేకమైన పాత్రను 15 నిమిషాల కోసం మహేష్ బాబు సన్నివేశాలను అనుకున్నారట. కానీ రామ్ చరణ్ చిరులను ఒకే స్క్రీన్ మీద చిరంజీవి భార్య చూడాలని పట్టుబట్టడంతో ఆ పాత్రను మెగా వారసుడు కోసం ఇచ్చేసారట. అలా రామ్ చరణ్ కోసం 45 నిమిషాల పాటు ఉండేలా ఈ చిత్రాన్ని పొడిగించడం మైనస్ గా మారింది. అందుకే కాజల్ పాత్రను పూర్తిగా తొలగించారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: