సీనియర్ హీరోతో హోటల్ రూమ్లో దొరికిన స్టార్ హీరోయిన్.. ఇండస్ట్రీని కుదిపేసే వార్త..!

Amruth kumar
చిత్ర పరిశ్రమలో హీరోలు, హీరోయిన్ల మధ్య ఎఫైర్ లు, లవ్ లు వంటి రూమర్లు రావడం కామన్.. అయితే కొన్నిసార్లు ఈ  రూమర్లు నిజమవుతాయి కూడా.. మిగిలిన సందర్భాల్లో ఇవి అబద్దాలగా మిగిలిపోతాయి. అయితే ఈ పుకార్లు కొన్నిసార్లు హీరో లేద‌దా హీరోయిన్ల ఫ్యామిలీ జీవితాన్ని కూడా సర్వనాశనం చేస్తాయి. అయితే ఇలాంటి ఫేక్ వార్తలు వల్ల బాలీవుడ్ సీనియర్ యాక్టర్ గోవింద్ , అరుణ్ అహుజా వైవాహిక బంధం తెగిపోయే పరిస్థితికి చేరుకుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాణి ముఖర్జీతో గోవింద్‌ ఎఫైర్ మైంటైన్ చేస్తున్నాడని వార్తలు అప్పట్లో తెగ వచ్చాయి. 90లో బాలీవుడ్ లోనే స్టార్ హీరోగా రాణించాడు.. ఆ సమయంలో ఆయనపై మీడియాలో ఎక్కువ ఫోకస్ చేస్తుండేది. ఒకానొక సమయంలో రాణి ముఖర్జీ- గోవిందా వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లుగా కూడా మీడియాలో వార్తలు వచ్చాయి.

అయితే రాణి ముఖర్జీ - గోవింద కలిసి నటించిన సినిమాలు అప్పట్లో సూపర్ హిట్ అయ్యాయి.. అలాగే ఈయన డాన్స్ బాగా వేస్తారు, యాక్టింగ్ స్టైల్ కూడా చాలా బాగుంటుంది. అయితే ఈయన ప్రొఫెషనల్ లైఫ్ తో పాటు వ్యక్తిగత జీవితం కూడా వార్తల్లో నిలిచేది. ఇక గోవింద 1987లో సునీత అహోజా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అలాగే వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.. అయితే హ్యాపీగా మ్యారేజ్ లైఫ్ కొనసాగిస్తున్న వీరి జీవితంలో ఫేక్ వార్తలు చిచ్చుపెట్టాయి.  గోవింద్‌ ఆయనకేరీర్‌లో కలిసిన నటించిన ఎందరో హీరోయిన్లతో ఎఫైర్ లు పెట్టుకున్నారని, వాళ్లని మోసం చేసి వదిలేస్తాడని ఫేక్ వార్తలు పుట్టించారు. ఇక ఈ పుకార్ల వల్ల గోవింద్‌ వ్యక్తిగత జీవితంలో ఎన్నో సమస్యలు వచ్చాయి. అలాగే సీనియర్ హీరో  ఇల్జామ్ అనే సినిమాలో తనతో కలిసి నటించిన  నీలం కొఠారీతో కూడా అక్రమ సంబంధం పెట్టుకున్నారని వార్తలు కూడా వచ్చాయి.

అలాగే రాణి ముఖర్జీతో 'హద్ కర్ ది ఆప్నే' సినిమా షూటింగ్ సమయంలో పరిచయం ఏర్పడింది.. స్విజర్లాండ్ , అమెరికా వంటి దేశాల్లో షూటింగ్ జరుపుకున్నప్పుడు.. వీరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది.. సినిమా పూర్తి అయిన తర్వాత కూడా ఎక్కువ కలిసేవారు ఆ క్రమంలోనే వీరిమధ్య అక్రమ సంబంధం ఉందనే ఫేక్ వార్తలు వచ్చాయి. అయితే గోవింద్‌ అప్పటికే సునీతని పెళ్లి చేసుకున్నాడు. గతంలో ఓ ప్రముఖ జర్నలిస్ట్ రాణి ముఖర్జీ , గోవింద్‌ ఒకే హోటల్ రూమ్ లో కలిసి ఉండటాన్ని చూశారట.. దాన్ని గురించి జర్నలిస్టు ఒక వార్త రాయటంతో ఇది అప్పుడు బాలీవుడ్ చిత్ర పరిశ్రమంలోనే సంచలనంగా మారింది.

రాణి, గోవిందా ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందా అని సునీతను మీడియా వాళ్లు ఎక్కువగా ప్రశ్నించేవారు. రాణి ముఖర్జీ, గోవిందా మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తున్నట్లుగా తరచూ వార్తలు వ‌చ్చేవి. ఇలాంటి సమయంలో రాణి ముఖర్జీ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని సంచ‌ల‌న‌ కామెంట్స్ చేసింది. "ఎవరైనా హీరోయిన్‌ గోవిందాతో మూడు నాలుగు సినిమాల్లో నటించిందంటే, చాలు ఆమెకు ఆయనతో ప్రేమ వ్యవహారం ఉందని మీడియా భావిస్తుంది. నాకంటే ముందు ఆయనతో ఇతర హీరోయిన్లను లింక్ చేశారు. నాకు తెలిసిన విషయం ఏంటంటే, గోవిందా లాంటి మంచి స్నేహితుడు, కాలక్షేపం చేసే వ్యక్తిని కనుక్కోవడం చాలా కష్టం." అని ఆమె చెప్పుకొచ్చింది. హోటల్‌ రూమ్‌లో కలిసి ఉన్నట్లు వస్తున్నాయి ఆరోపణలను ఆమె ఖండించలేదు. దీంతో రూమర్స్ మరింత ఎక్కువయ్యాయి. ఈ ఇంటర్వ్యూ తర్వాత, సునీత గోవిందాను వదిలి తన పుట్టింటికి వెళ్ళిపోయింది. తర్వాత గోవిందా, సునీత ఇద్దరూ తమ మనస్పర్థలను పరిష్కరించుకుని మళ్లీ ఫ్రెష్‌గా వైవాహిక బంధాన్ని ప్రారంభించారు. ఇప్పుడు ఇద్దరు హ్యాపీగా లైఫ్ గడిపేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: