Bigg Boss 8 హౌస్ లోనే తన రెమ్యూనరేషన్ గురించి కక్కేసిన మణికంఠ..!?

Anilkumar
బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 8 ఏడో వారం ర‌స‌వ‌త్త‌రంగా సాగుతుంది. గ‌త‌వారం కిర్రాక్ సీతను బ‌య‌ట‌కు వెళ్ల‌గా ఈ వారం ఎవ‌రు వెళుతున్నార‌ని ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ వారం ఇంటి నుంచి బయటికి పంపడానికి నామినేట్ అయిన సభ్యులు 9 మంది అంటూ పెద్ద షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇక ఎవ‌రెవ‌రు నామినేట్ అయ్యింది అనేది చూసుకుంటే.. గౌతమ్, పృథ్వీ, నిఖిల్ మణికంఠ, యష్మీ, తేజ, నబీల్, ప్రేరణ, అవినాష్ ఉన్నారు. దీంతో ఇందులో నుంచి ఎవ‌రు ఎలిమినేట్ అవుతారు అనేది ఈ వారం తెలియనుంది. అయితే ఈరోజు టాస్క్‌లో భాగంగా హౌజ్‌మేట్స్‌కి క్రేజీ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్.  

మణికంఠ కూడా సరదాగా తన తోటి హౌస్ మేట్స్ తో మాట్లాడుతున్న సమయం లో రెమ్యూనరేషన్ గురించి నోరు జారేస్తాడు. గంగవ్వ, హరితేజ, నభీల్, పృథ్వీ, మణికంఠ ఒక రూమ్ లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. నభీల్ గంగవ్వ తో మాట్లాడుతున్న సమయం లో మణికంఠ మధ్యలో కలగచేసుకొని ‘నాకు వారానికి వచ్చేదే లక్ష..ఎక్కడ సరిపోతుంది చెప్పు’ అని అంటాడు. దానికి హరితేజ పక్కన కూర్చొని ఇలా బయటకి చెప్పేశాడేంటి అని షాకింగ్ రియాక్షన్ ఇస్తుంది. ఇలా హౌస్ రూల్స్ ని బ్రేక్ చేస్తూ చాలా సంఘటనలు జరుగుతున్నాయి. నిన్న యష్మీ ప్రేరణ కి నామినేషన్స్ వేసే విషయం, ఆ ప్రక్రియ ప్రారంభం కాకముందే టేస్టీ

 తేజా తో చెప్తుంది, ఆ తర్వాత నేరుగా ప్రేరణకే చెప్తుంది. కేవలం యష్మీ మాత్రమే కాదు, హౌస్ లో మిగిలిన కంటెస్టెంట్స్ కూడా నామినేషన్స్ గురించి మాట్లాడుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి.  బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి చూస్తే ఇలా ఎలిమినేషన్ ఎవరనేది ఓటింగ్ పోల్స్ ద్వారా చెప్పలేకపోవడం ఇదే మొదటిసారి. కాబట్టి, ఎవరికి నచ్చిన ఫేవరెట్‌ కంటెస్టెంట్‌కు వాళ్లకే ఓటింగ్ చేసుకోవడం బెటర్ అని తెలుస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: