చిరంజీవికే చుక్కలు చూపించిన సిల్క్ స్మిత .. దెబ్బకు ముగ్గురు హీరోయిన్స్ తో నటించాల్సి వచ్చిందిగా..

Amruth kumar
ఎవర్ గ్రీన్ నటి సిల్క్ స్మిత గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు.. ఐటెం సాంగ్స్ కోసం ప్రత్యేకంగా హీరోయిన్లు ఉండేవారన్న విషయం అందరికీ తెలుసు.. జ్యోతిలక్ష్మి , జయమాలిని , సిల్క్ స్మిత , డిస్కో శాంతి వంటి డాన్సర్స్‌ ఐటెం సాంగ్స్ లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకునేవారు. అయితే అప్పట్లో టాప్ హీరోలందరి సినిమాల్లో ఐటెం సాంగ్స్ కచ్చితంగా ఉండేవి. ఇక తర్వాత కాలంలో ఐటెం సాంగ్స్ హీరోయిన్స్ తోనే చేయిస్తూ వాటిని స్పెషల్స్ సాంగ్స్ గా ప్రేక్షకులకు చూపించడం మొదలుపెట్టారు. అయితే గతంలో చిరంజీవి హీరోగా కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన కొండవీటి రాజా సినిమాలో ఐటెం సాంగ్ కి ఏకంగా ముగ్గురు ముద్దుగుమ్మలతో చేయించారు. దీని వెనుక ఆసక్తికరమైన స్టోరీ ఉంది.. అది ఏంటో ఇక్కడ చూద్దాం.

రాఘవేందర్రావు సినిమా అంటేనే హీరోయిన్లను ఎంతో అందంగా చూపిస్తారు .. అలాంటిది ఐటెం సాంగ్స్ విషయంలో కూడా అయినా ఎక్కడ రాజీ పడేవారు కాదు.  ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ ని భారీగా తీయాలని ఆయన ప్లాన్ చేశారు. . సిల్క్ స్మితనే ఆయనను సెలెక్ట్ చేశారు.. భారీగానే రెమ్యూనిరేషన్ కూడా ఇచ్చారు.. అదనంగా మరో కొంత ఇచ్చారు చెన్నైలో వాహని స్టూడియోలో ఐదు లక్షల ఖర్చుతో భారీ సెట్ వేశారు. నాలుగు నెలలు ముందే సిల్క్ స్మితని తీసుకున్నారు షెడ్యూల్ ప్రకారం షూటింగ్ ప్రారంభించారు. ఇక షూటింగ్ కి వచ్చిన సిల్క్ స్మితని చూసి రాఘవేంద్రరావు షాక్ అయ్యారు.. అప్పుడే నిద్రలేచి వచ్చినట్లుగా ఆమె ఉంది.

 హెయిర్ స్టైల్ చాలా చండాలంగా ఉంది హెయిర్ స్టైల్ మార్చుకోమన్నారు ... ఆమె ఆయన మాటలను పట్టించుకోలేదు రాఘవేంద్రరావుకి పిచ్చ కోపంపం తెప్పించింది. ఆమెతో వాదించలేక పాట షూట్ను ఆపేశారు. పొగ మంచులో కొంత షూట్ చేసారు. పొగ మంచును ఈ షాట్ కోసం స్ప్రెడ్ చేశారు సిల్క్ స్మిత ఫ్యాన్ వేసుకుని కూర్చోవడంతో పొగ మంచు పోయింది. ఇక ఆమెని తొలగించారు. అప్పటికి స్మితతో రెండు చరణాలు మాత్రమే చిత్రీకరించారు. పల్లవి ఇంకో చరణం ఉంటే జయమాలినితో అనురాధతో మిగిలినవి షూట్ చేశారు.. ఇలా ముగ్గురితో ఈ పాటని షూట్ చేస్తే బాగుంటుందని ఈ ముగ్గురితో పాటని షూట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: