భర్తతో రమ్యకృష్ణ విడాకులు.. చివరి నిమిషంలో ఆపింది ఎవరంటే.?

Pandrala Sravanthi
 హీరోయిన్ రమ్యకృష్ణ అప్పటి స్టార్ డైరెక్టర్ అయినటువంటి కృష్ణవంశీని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయితే వీరిద్దరి పర్సనల్ లైఫ్ లో కూడా చాలా గొడవలు వచ్చినట్టు ఇప్పటికే మీడియాలో పలు రూమర్లు చక్కర్లు కొట్టాయి. అంతేకాదు రమ్యకృష్ణ తన కొడుకుని తీసుకొని హైదరాబాద్ వదిలి చెన్నైకి వెళ్ళిపోయిందనే టాక్ కూడా వినిపించింది. అయితే రమ్యకృష్ణ,కృష్ణవంశీ ఇద్దరు విడాకుల వరకు వెళ్లి ఎందుకు ఆగిపోయారు.. వీరిద్దరూ విడాకులు తీసుకోకుండా ఆపిన వ్యక్తి ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.. గులాబీ, ఖడ్గం, సింధూరం, నిన్నే పెళ్ళాడుతా, చంద్రలేఖ, మురారి,అంతఃపురం, రాఖి,శ్రీ ఆంజనేయం, డేంజర్,చక్రం,చందమామ, మహాత్మా, గోవిందుడు అందరివాడేలే, మొగుడు, నక్షత్రం, శశిరేఖా పరిణయం,పైసా వంటి ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలకు దర్శకత్వం వహించారు. 

ఇక ఈయన చివరిగా రంగమార్తాండ అనే మూవీ ద్వారా మన ముందుకు వచ్చారు. అయితే అలాంటి కృష్ణవంశీ రమ్యకృష్ణతో ప్రేమలో పడి ఇద్దరు పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరికి రిత్విక్ వంశి అనే ఓ కొడుకు కూడా ఉన్నారు. అయితే బాబు పుట్టాక ఇద్దరి మధ్య గొడవలు వచ్చి విడాకులు తీసుకోబోతున్నట్టు రూమర్లు వినిపించాయి. అయితే వీరిద్దరూ విడాకులు తీసుకోవాలనుకున్న సమయంలో రిత్విక్ వంశీ చాలా ఏడ్చారట.అమ్మ నాన్న విడిపోకుండా ఎప్పటికీ నాతో ఉండాలి అని కన్నీళ్లు పెట్టుకున్నారట. ఇక కన్న కొడుకు అలా కన్నీళ్లు పెట్టుకోవడం చూడలేని రమ్యకృష్ణ,కృష్ణవంశీ కొడుకు కోసం కలిసి ఉండలేమా అని అప్పటినుండి ఇద్దరు ఎంతో అన్యోన్యంగా కలిసి ఉన్నారట. 

అయితే వీరు విడాకులు తీసుకోకపోయినప్పటికీ వీరి విషయంలో చాలా సార్లు విడాకుల వార్తలు వినిపించాయి. ఇక దీని గురించి చాలా సందర్భాలలో ఇద్దరు క్లారిటీ ఇచ్చారు. ఇక మేమిద్దరం కలిసి ఎక్కువగా ఫంక్షన్లకు ఈవెంట్లకు రాకపోవడం వల్లే ఈ విడాకుల వార్తలు వినిపిస్తున్నాయి.కానీ మేము సోషల్ మీడియాని ఎక్కువగా పట్టించుకోము.మా పర్సనల్ లైఫ్ వేరేగా ఉంటుంది.ఒక్కసారి ఇంట్లోకి వెళ్లామంటే మేం ఇలాంటి రూమర్లు పట్టించుకోము అంటూ కృష్ణవంశీ ఓ సందర్భంలో విడాకులపై క్లారిటీ ఇచ్చారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: