మహేష్ ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్.. SSMB 29 ఏకంగా అన్ని భాగాలు..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. మహేష్ బాబు ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా గుంటూరు కారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ... శ్రీ లీలా , మీనాక్షి చౌదరి ఈ మూవీ లో హీరోయిన్లుగా నటించారు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే మహేష్ తన తదుపరి మూవీ ని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఈ సినిమాకు రాజమౌళి తండ్రి అయినటువంటి విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తున్నాడు. ఇకపోతే విజయేంద్ర ప్రసాద్ కొన్ని రోజుల క్రితం మాట్లాడుతూ ... ఇప్పటికే రాజమౌళి , మహేష్ బాబు కాంబో సినిమాకు సంబంధించిన కథ పనులు అన్ని పూర్తి అయ్యాయి అని , వచ్చే సంవత్సరం జనవరి నుండి సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది అని తెలియజేశారు. ఇకపోతే తాజాగా మహేష్ అభిమానులకు ఒక అదిరిపోయే జోష్ నింపే ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే రాజమౌళి , మహేష్ కాంబోలో రూపొంది సినిమా కథ స్పన్ చాలా పెద్దగా ఉన్నట్లు , దానితో దానిని ఒక భాగంలో దానిని చూపించడం కష్టం కానున్నట్లు , దానితో మూవీ బృందం వారు దీనిని రెండు భాగాలుగా రూపొందించాలి అనే డిసైడ్ అయినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇదే కానీ జరిగితే మహేష్ బాబు , రాజమౌళి దర్శకత్వంలో రూపొందే రెండు భాగాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు లభించే అవకాశం ఉంటుంది అని మహేష్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: