కొరటాల లిస్టులో మిగిలింది ఆ ఒక్క హీరోనే.. ఆ కాంబోలో మరో మూవీ వస్తే బ్లాక్ బస్టర్ గ్యారంటీనా..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో కొరటాల శివ ఒకరు. ఈయన రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన మిర్చి మూవీ తో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. మొదటి మూవీ తోనే సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత మహేష్ బాబు హీరో గా శ్రీమంతుడు సినిమాను రూపొందించాడు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జనతా గ్యారేజ్ మూవీ ని రూపొందించాడు. ఇక శ్రీమంతుడు సినిమాతో మహేష్ బాబు కు మంచి విజయాన్ని అందించిన కొరటాల ఆ తర్వాత మరోసారి మహేష్ బాబు తో భరత్ అనే నేను సినిమాను రూపొందించాడు.

ఈ మూవీ కూడా మంచి విజయం అందుకుంది. ఇక ఆ తర్వాత చిరంజీవి హీరోగా ఆచార్య మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ ఫ్లాప్ అయ్యింది. ఇక జనతా గ్యారేజ్ మూవీ తో జూనియర్ ఎన్టీఆర్ కు బ్లాక్ బస్టర్ ఇచ్చిన కొరటాల మళ్ళీ ఆయన తో దేవర పార్ట్ 1 సినిమాను రూపొందించాడు. మరికొన్ని రోజుల్లోనే ఆయనతో దేవర పార్ట్ 2 మూవీ ని కూడా తెరకెక్కించబోతున్నాడు. ఇక కొరటాల శివ "మిర్చి" మూవీ తో ప్రభాస్ కి బ్లాక్ బస్టర్ విజయాన్ని ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. మరోసారి వీరి కాంబోలో సినిమా రూపొందే అవకాశం ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

ఇప్పటికే వీరి కాంబోలో మిర్చి మూవీ రూపొంది బ్లాక్ బస్టర్ విజయం సాధించి ఉండడంతో ప్రభాస్ అభిమానులు మామూలు ప్రేక్షకులు కూడా వీరి కాంబోలో మరో మూవీ వస్తే బాగుంటుంది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ప్రభాస్ "మిర్చి" మూవీ వరకు కేవలం తెలుగు సినిమాల్లో నటిస్తూ వచ్చాడు. ఆ తర్వాత ఆయన వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాల్లో మాత్రమే నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: