రష్మిక అభిమానులు కూడా దరిద్రంగా ఉంది అంటూ హేట్ చేసిన సినిమా ఇదే.. ఆమె కెరియర్ లోనే పరమ చెత్త డిజాస్టర్..!

Thota Jaya Madhuri
కొన్నిసార్లు మన టైం బాగోలేనప్పుడు ఏం చేసినా అది దరిద్రంగానే మారుతుంది . ఎంతలా అంటే దారిన పోయిన దరిద్రాన్ని  పిలిచి మరీ మనం హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకున్నంత దారుణంగా ఉంటుంది . అలాగే తయారైంది రష్మిక పరిస్థితి. రష్మిక మందన్నా అంటే ఒక స్టార్ హీరోయిన్.  ఒక నేషనల్ క్రష్.  ఒక అందాల ముద్దుగుమ్మ . ఎటువంటి రోల్స్ నైనా సరే చక చకా  యాక్సెప్ట్ చేస్తుంది. అంతే బోల్డ్ గా కూడా నటిస్తుంది . జనాలకు ఇంత వరకే తెలుసు . అయితే ఆమె కెరియర్ లో నటించిన సినిమాలలో ఒక సినిమా ఆమెకు ఎప్పుడూ గుర్తుండి పోతుందట . హైలెట్ విషయం ఏంటంటే అది ఆమె నటించిన హిట్ సినిమా కాదు డిజాస్టర్ సినిమా .


ఎస్ రష్మిక మందన తన కెరీర్ లో నటించిన సినిమాలలో కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయితే అన్నిటికన్నా డిజాస్టర్ గా నిలిచిన మూవీ మాత్రం "ఆడవాళ్లు మీకు జోహార్లు". శర్వానంద్ హీరోగా నటించిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్గా నటించింది . అసలు ఈ సినిమాలో రష్మిక పాత్ర ఏంటి ..? ఈ పాత్ర ఆమె ఎందుకు ఒప్పుకుంది..? అంటూ సొంత ఫ్యాన్స్ కూడా సినిమా రిలీజ్ అయ్యాక సందేహ పడ్డారు .


అంతలా ఆమె ఈ సినిమాతో నెగిటివ్ టాక్ దక్కించుకుంది . పుష్ప లాంటి సూపర్ సూపర్ హిట్ సినిమా చేసిన ఒక హీరోయిన్ ఇలాంటి సినిమా చేసింది ఏంటిరా బాబు అంటూ తలలు కూడా పట్టుకున్నారు. అయితే నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ని అనుకున్నారట డైరెక్టర్ . ఆమె ఈ సినిమా రిజెక్ట్ చేయడంతో ఈ అవకాశం అటు రష్మిక మందన్నా ఖాతాలో పడిపోయింది.  అయితే రష్మిక మందన్నా పుష్ప సినిమాతో వచ్చిన క్రేజ్ తో ఎక్కువ అవకాశాలు రావడంతో ఆ అవకాశాలల్లో కన్ఫ్యూజ్ అయిపోయి ఇలాంటి తన క్యారెక్టర్ కి స్కోప్ లేని సినిమాను చూస్ చేసుకుంది.  అయితే ఈ సినిమా మాత్రం ఆమెకు పాజిటివ్ కామెంట్స్ కన్నా నెగిటివ్ కామెంట్స్ దక్కేలా చేశాయి.  రష్మిక మందన్నా ఫ్యాన్స్ కూడా ఈ సినిమా ఆమె ఎందుకు చేసింది అంటూ అసహనంగా ధీనంగా కామెంట్స్ పెట్టారు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: